కోడెల శివ‌రాం మార్క్ పాలి ‘ ట్రిక్స్ ‘ … సీటు కోస‌మేనా…!

దివంగ‌త మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా సాగిన ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్‌. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభ‌జన జ‌రిగాక న‌వ్యాంధ్ర తొలిస్పీక‌ర్‌గా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఆయ‌న‌కు ఉన్న పేరును చివ‌ర్లో ఆయ‌న కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి, కుమారుడు శివ‌రాం ఇద్ద‌రూ తీసేశారు. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కుమారుడు, […]

ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో […]

తిరుపతి వైసీపీలో ఏదో జరుగుదోంది?

రాయలసీమ జిల్లాల్లో ప్రధానమైనది చిత్తూరు జిల్లా.. అందులోనూ తిరుపతి.. అంత ప్రాధాన్యమున్న తిరుపతి వైసీపీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కార్పొరేటర్లు ఆయనను విమర్శించే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి పార్టీలో ఎటువైపు పోతోందో కిందిస్థాయి కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కార్పొరేటర్లందరికీన భూమన డామినేట్ చేస్తుండటంతో చివరికు వారంతా ఒక్కటై.. ఎమ్మెల్యేను ఒంటరి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీ సీట్లను […]

లోకేష్ ను పాపులర్ లీడర్ చేస్తున్న జగన్

చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమేమో అన్నట్లుంది ఏపీలో రాజకీయ పరిస్థితులు.. అదేంటి లోకేష్ ను రాజకీయంగా జగన్ ఎందుకు పాపులర్ చేస్తాడనే అనుమానాలు వస్తాయి. కానీ.. ఆలోచిస్తే అదే జరుగుతోంది. ఎలా అంటే.. రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. టీడీపీ కార్యకర్తలపై ఎవరు దాడిచేసినా నారా లోకేష్ వాలిపోతున్నాడు. వారిని పరామర్శిస్తున్నాడు. ధైర్యం చెబతున్నాడు.. అదే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ చూసినా లోకేష్ వార్తల్లో ఉంటుండటంతో చెక్ పెట్టాలని జగన్ […]

ఆ ఇద్దరూ సంతోషపడేలా జగన్ నిర్ణయం!

వైసీపీలో ఇద్దరు నాయకులు బాగా అసంత్రుప్తిగా ఉన్నారు. ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. ఈ విషయం సీఎం, పార్టీ చీఫ్ జగన్ కు కూడా తెలుసు. తనకు స్పీకర్ పదవి వద్దు.. మంత్రి పదవి కావాలని తమ్మినేని చాలా రోజులుగా అడుగుతున్నాడు.. సమయం ఇంకా రాలేదు కదా అని జగన్ అనుకుంటున్నాడు.. ఇక ధర్మాన ప్రసాదరావు అయితే.. తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నాడు. ఇంత సీనియర్ లీడర్ అయిన తనకు పార్టీలో […]

నాన్‌వెజ్‌ ప్రియులకు శుభవార్త..ఏపీలో రాబోతున్న మ‌ట‌న్ మార్ట్‌లు!?

నాన్‌వెజ్ ప్రియుల‌కు ఇది శుభ‌వార్తే. ఏపీలో మటన్ మార్ట్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్ర‌భుత్వం మొబైల్‌ మటన్‌ దుకాణాల‌ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్‌ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్‌ మటన్‌ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు. ఈ […]

బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?

విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]

జగన్ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..

రాష్ట్రంలోని రోడ్లకు వర్షాకాలం అనంతరం వెంటనే మరమ్మతు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట. అదేంటి.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వీరికెందుకు అంత హ్యాపీ.. అందులోనూ ఏపీలో ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన పార్టీలో ఉంటారు కదా అనుకునేరు. అసలు విషయమేమిటంటే.. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన కార్యకర్తలు, […]

ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయ‌క‌చ‌వితి`..ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఫైర్‌

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `వినాయ‌క‌చ‌వితి` హీటెక్కించేస్తోంది. క‌రోనా థార్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న కార‌ణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరుపై హిందూ సంఘాలు మ‌రియు ప్ర‌జ‌లు ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌ల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]