గౌతంరెడ్డి ప‌క్కాప్లాన్‌తోనే ర‌చ్చ చేశాడా!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు గౌతం రెడ్డి పేరు విజ‌య‌వాడ రాజ‌కీయాలు, విజ‌య‌వాడ వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అయింది. కానీ, వంగ‌వీటి రంగాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చారు. నిజానికి రంగా త‌న‌యుడు రాధాకృష్ణ‌ అన్న‌ట్టు.. రంగాను విమ‌ర్శించే స్థాయి గౌతం రెడ్డికి లేనే లేదు. అయినా కూడా త‌న స్థాయిలేని వ్య‌క్తి, త‌న స్థాయి కాని వ్య‌క్తిని విమ‌ర్శించ‌డం ద్వారా రాష్ట్ర వ్యాప్త చ‌ర్చ‌కు దారి తీయడం వెనుక పెద్ద ప్లాన్ ఉంద‌ని అంటున్నారు […]

ఆ ప్లాన్‌తోనే వంగ‌వీటిపై గౌతంరెడ్డి వ్యాఖ్య‌లు!

ఊర‌క‌రారు మ‌హానుభావులు- అన్న‌ట్టుగానే.. రాజ‌కీయ నేత‌లు సైతం త‌మ నోటిని ఊరికేనే పారేసుకుంటారా చెప్పండి? త‌మ‌కు ఏమీ లాభం చేకూరద‌న్న‌ప్పుడు అడుగు తీసి అడుగు కూడా వేయ‌ని నేత‌లు.. ఒక్క‌సారిగా క‌ల‌క‌లం సృష్టించేలా? ఒక్క‌సారిగా త‌న పేరు బ‌య‌ట‌కు వ‌చ్చేలా? త‌న చుట్టూతానే రాజ‌కీయాలు న‌డిచేలా? త‌న పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేశారంటే.. దాని వెనుక స్కెచ్‌.. ప్లాన్ అంతా ఇంతా ఉంటుంద‌ని ఊహించ‌లేం. ఇప్పుడు అలాంటి భారీ స్కెచ్‌తోనే విజ‌య‌వాడ‌లో మాజీ క‌మ్యూనిస్టు నేత, […]

టీడీపీలో కేశినేని నిర్వేదం…ఆ పార్టీ వైపు చూపు..?

కేశినేని నాని విజ‌య‌వాడ ఎంపీ… ముక్కుసూటి త‌నానికి మారుపేరు. కేశినేని ట్రావెల్స్ అధినేత‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాని 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరిన కొద్ది రోజుల‌కే బ‌య‌ట‌కు వ‌చ్చిన నాని చంద్ర‌బాబు హామీతో గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే ఎంపీ సీటుపై హామీ పొందారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో ఖ‌ర్చంతా భ‌రించ‌డంతో పాటు పార్టీకి ఆర్థికంగా మేళ్లు చేసిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో హామీ […]

మ‌ల్లాది విష్ణు వైసీపీ ఎంట్రీ… ఆ ఇద్ద‌రికి ఎర్త్ త‌ప్ప‌దా..!

విజ‌య‌వాడ‌కు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడం ఖరారైంది. విష్ణు వైసీపీ ఎంట్రీపై గ‌త ప‌ది రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఇటీవ‌ల నాలుగైదు సార్లు వైసీపీలో చేరే అంశంపై జ‌గ‌న్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరుతున్న విష‌యాన్ని క‌న్‌ఫార్మ్ చేశారు. ప‌ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని విష్ణు పార్టీ మార‌నున్నారు. ఇదిలా ఉంటే […]

ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గ‌మ్మే సాక్ష్యం

మిత్రప‌క్షాల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌ధాని ప్రాంతం, ఏపీకి కీల‌కమైన విజ‌య‌వాడ‌లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. 2014 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌రిగిన సంఘ‌ట‌న మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వ‌యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల రావు… క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణాస్వీకారానికి గైర్హాజ‌రవ‌డం […]

ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!

ఏపీ రాజ‌కీయాల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ త‌ర‌పున ఉద‌యం మీడియా ఛానెళ్ల‌లో ఆయ‌న బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చ‌ర్చ‌లు చూసే వాళ్ల‌లో చాలా మంది ఆయ‌న‌కు మ్యాట‌ర్ తక్కువ‌…మాటలు ఎక్కువ అని కూడా చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇక బొండా గెల‌వ‌డానికి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హ‌డావిడి చేస్తుంటారు. గ‌త మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు ముందు వ‌ర‌కు బొండా […]

దేవినేని ఉమా వ‌దిన మృతిపై వైసీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచ‌ల‌న ఆరోప‌ణలు వ‌చ్చాయి. ఉమా త‌న వ‌దిన (మాజీ మంత్రి దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ భార్య‌)ను చంపేశాడ‌ని కృష్ణా జిల్లా జ‌నాలు ఇప్ప‌ట‌కీ అనుకుంటార‌ని వైసీపీ నేత జోగి ర‌మేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఉమాను ర‌మేశ్ ఉత్త మాట‌లు చెప్పే పిట్ట‌ల దొర‌గా కూడా అభివ‌ర్ణించారు. జోగి ర‌మేశ్ గ‌త ఎన్నిక‌ల్లో మైల‌వరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన ర‌మేశ్ […]

జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వారి స్థ‌లం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి ఘ‌ట్ట‌మ‌నేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ్ర‌తికున్న రోజుల్లో ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అండ్ ఆదిశేష‌గిరిరావులు ఆయ‌న వెంట న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేయ‌కుండా ఉండి ఉంటే.. ఘ‌ట్ట‌మ‌నేని వారి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే ఉండేది. అయినా కూడా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం జ‌గ‌న్ ప‌ట్ల విధేయ‌త‌గానే ఉంది. తాజాగా జ‌గ‌న్‌కి ఆదిశేష‌గిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నార‌ని వార్త వ‌చ్చింది. రాష్ట్ర బైఫ‌ర్ కేష‌న్ […]

జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే […]