కేశినేని ఫ్యామిలీలో చిచ్చు….ఎవరి పని?

ఇప్పటివరకు తన అన్న కేశినేని నానికి అండగా నిలిచిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని..ఈ మధ్య కాలంలో సెపరేట్ గా రాజకీయం నడపటం మొదలుపెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నానికి సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా చేసుకుంటూ వెళుతున్నారు. అయితే నాని…అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని ఎప్పటినుంచో కథనాలు కూడా వస్తున్నాయి…అలాగే సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ కేశినేని నానిని సైడ్ చేసి…ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ […]

విజ‌య‌వాడ‌లో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్ద‌రు జ‌న‌సేన నేత‌లు…!

విజ‌య‌వాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు పోటీగా జ‌న‌సేన తెర‌మీదికి వ‌స్తోంది. ఇక్క‌డ నుంచి యువ నాయ‌కులుగా .. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు జ‌న‌సేన త‌ర‌ఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వ‌స్తున్నారు. దీంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీ యాల్లో ఇప్పుడు జన‌సేన కూడా చేర‌డం గ‌మ‌నార్హం. వారే.. పోతిన మ‌హేష్‌, సోడిశెట్టి రాధా. ఈ ఇద్ద‌రు […]

దేవినేని అవినాష్ ఈ సారి గెలుస్తాడా… బెజ‌వాడ‌లో రాజ‌కీయంలో ఈ మార్పు ఏంటో ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్‌ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌నే అంటున్నారు. నియోజకవర్గంలో […]

సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!

భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]

ఎన్నికల ఫలితాలపై స్పందించిన హేమ.. ఏమన్నారో తెలుసా?

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటి హేమ మా ఎన్నికల ఫలితాల పై నటి హేమ స్పందించింది. మా ఎన్నికలలో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి అంటూ అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు […]

పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమావేశంపై సర్వత్రా చర్చ

జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ చాలా రోజుల తరువాత రాజకీయ చర్చల్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించినట్లు లేరు. అదేంటో.. ఉన్నట్టుండి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ కూడా భేటీలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్ లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరితో చర్చలు జరిపారు. దాదాపు రెండు […]

బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా […]

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇలా!

రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధ‌ర‌కు సామాన్యలు హ‌డ‌లెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండ‌డంతో.. వాహనం నడపాలంటేనే ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. ఇప్ప‌టికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శ‌నివారం మ‌ళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి.. తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని […]

దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]