రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధరకు సామాన్యలు హడలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో.. వాహనం నడపాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శనివారం మళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి..
తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.05కి చేరగా.. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరం విజయవాడలో రూ.105.17కు వెళ్లింది.