రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…

తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్‌, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్‌ ఫ్యామిలీ […]

కేసీఆర్ వర్సెస్ ఈటల ..మధ్యలో రవీందర్..

హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఈటల మరింత చురుగ్గా ముందుకు వెళుతున్నారు. నన్ను.. అన్యాయంగా శిక్షించారు.. అవమానకరంగా పార్టీనుంచి బయటకు పంపారనేది ఈటల భావన. ఈ ఫీలింగును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టి ప్రయోజనం పొందాలనేది ఈటల ప్లాన్. అందులో భాగంగానే ప్లాన్ అమలు చేసి హుజూరాబాద్ లో సక్సెస్ అయ్యారు. ఇపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చాటి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల భావిస్తున్నారు. అందుకే […]

నిర్ణయం పాతదే అయినా.. ఉన్నట్టుండి తెరపైకి..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఎవరికీ అంతుపట్టవు.. అందులోని అంతరార్థమూ అర్థం కాదు.. అలా అని అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయరు. కనీసం అడగాలనే ఆలోచన కూడా వారికి రాదు. అందుకు ఓ ఉదాహరణే.. రాజధాని మార్పు. మూడు రాజధానుల తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి మళ్లీ వస్తామని అసెంబ్లీలో చెప్పేంతవరకు ఎమ్మెల్యేలకే తెలియదు. అంతెందుకు మంత్రి వర్గ సమావేశంలో జగన్ తన సహచరులకు వివరించేంతవరకు వారికి కూడా తెలియదు. విధానపరమైన నిర్ణయాలను […]

బాధ్యత మోదీది అయినా.. ఎఫెక్ట్ కేసీఆర్ పైనే..

తెలంగాణలో ఈరోజు (సోమవారం) రైతులు అత్యంత ఆసక్తిగా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. సాయంత్రం దాదాపు రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చుంటుంది. ఎందుకంటే వరి కొనుగోలు వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. వరి కొనుగోలు చేయాలని కేసీఆర్..మేము కొనం అని కేంద్రం అంటోంది. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసి ఢిల్లీకి వెళ్లొచ్చిన కేసీఆర్ ఇంతవరకు వరి సమస్యపై నోరు విప్పలేదు. సోమవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం […]

మూడేళ్లలో ముగ్గురు..

రెండంటే రెండే రోజులు గడిస్తే.. ఆ తరువాత ఆయన మాజీ.. అంతే ఇంతకాలం ఉన్న హోదా.. దర్పం.. ప్రభుత్వ అధికారులపై అజమాయిషీ ఇక ఏవీ ఉండవు.. అందరిలాగానే ఆయన కూడా మాజీ అధికారుల జాబితాలో చేరిపోతారు. అంతలోపే ఓ సంతోషకరమైన వార్త అతనిని పలకరంచింది. మీ సేవలు బాగున్నాయి.. మరికొంతకాలం మీరు సర్వీసులో ఉంటారు.. అని ఆయనకు సమాచారం వచ్చింది. ఇంకేముంది.. ఆయన హ్యాపీ.. ఆయనతో పాటు అధినేత కూడా హ్యాపీ.. ఆ వ్యక్తి ఎవరంటే సమీర్ […]

టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు […]

నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో […]

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…

తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీరలా చేశారు.. వారలా చేశారు.. అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలే రైతులు వరి కొనుగోలు సమస్యతో ప్రాణాలు కోల్పోతుంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు చేశామంటే.. చేశామని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకుడు, […]

తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు […]