టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ నెటింట విమర్శలకు దారి తీసాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ నటుడు సత్యరాజ్.. రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే అసలు ఊరుకోమని.. ఏపి డిప్యూటీ సీఎం పవన్కు సత్యరాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళ్లో మురుగన్ మానాడు పేరిట బిజెపి నిర్వహించిన సమ్మేళనంలో పవన్ మాట్లాడుతూ నాస్తికులు, సెక్యులర్స్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు.
ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై నటుడు సత్యరాజ్ మండిపడ్డాడు. మురుగన్ మానాడు పేరుతో తమిళీలను మోసం చేయగలమనుకుంటే అది మీ తెలివి తక్కువ పనే అవుతుంది. తమిళ ప్రజలు తెలివైన వారు అంటూ సత్యరాజ్ చెప్పుకొచ్చాడు. తమిళనాట మీ ఆటలు సాగవని హెచ్చరించిన సత్యరాజ్.. వికేసి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డాడు. కాగా పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే డిఎంకె నేతలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమిళనాడుకు మీకు ఏమి సంబంధం అని డిఎంకె కీలక నేత మంత్రి శేఖర్ బాబు.. పవన్ ను ప్రశ్నించాడు. మా రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవద్దని.. ఒకవేళ అంతగా తమిళనాడు పై ప్రేమే ఉంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచి చూపించండి.. అంతేకానీ ఇలాంటి చిచ్చు వ్యవహారాలు చేయవద్దంటూ పవన్ కి సవాల్ విసిరాడు. ప్రస్తుతం పవన్ పై వస్తున్న ఈ విమర్శలు వైరల్ గా మారుతున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.