ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఓకే హీరో, హీరోయిన్లతో ఎన్ని సినిమాలు వచ్చిన మంచి కంటెంట్ ఉంటే చాలు కచ్చితంగా సినిమాలను ఆడియోస్ ఆదరించేవారు. బ్లాక్ బస్టర్లుగా నిలిపేవారు. అయితే ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన తర్వాత.. మళ్ళీ అదే కాంబో రిపీటెడ్ గా వస్తుంటే ఆడియన్స్ ఆ సినిమాను చూడడానికి బోర్ గా ఫీల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే.. దర్శకులకు ఇండస్ట్రీలో ఓ క్రేజి కాంబో సెట్ చేయడం అంటే కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులో హీరోయిన్లను ఎంచుకోవడం అంటే మరీ కష్టమైపోయింది.
నిన్నమొన్నటి వరకు ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్టు మూవీ అంటే టక్కున రష్మిక , జాన్వి కపూర్ల పేర్లే వినిపించేవి. ఏ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయినా సరే.. అందులో రష్మిక, జాన్వీలనే హీరోయిన్లుగా సెట్ చేస్తూ వచ్చేవారు. దర్శకులు అయితే తాజాగా ఈ ట్రెండ్ మారుస్తూ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంచలన డెసిషన్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ సినిమాలో ఓ క్రేజీ బ్యూటీని రంగంలోకి దింపాడు. ఆమె రుక్మిణి వసంత్. దీంతో ఇప్పుడు మళ్లీ డైరెక్టర్స్ రుక్మిణి వసంత్ వైపు రూట్ మారుస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో అవకాశం కొట్టేసిన ఈ అమ్మడు కచ్చితంగా మంచి టాలెంటెడ్ అని ఫిక్స్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నెలకొంది. దీంతో రుక్మిణి వసంత్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో బిగ్ జాక్పాట్ ఛాన్స్ కొట్టేసిందట రుక్మిణి. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు ఆర్సి17 రన్నింగ్ టైటిల్ తో సుకుమార్ డైరెక్షన్లో రాంచరణ్ నటించిన మూవీ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి రానున్న నేపథ్యంలో.. సుకుమార్ ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారడంతో చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కుందనపు బొమ్మ చెర్రీ పక్కన పర్ఫెక్ట్ గా పెబిర్ అని.. అదిరిపోయే రీల్ కాంబో అవుతారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లెక్కల మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా అంటూ.. ఈ కాంబో వర్కౌట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.