అతని నమ్మడం వల్లే ఇదంతా.. మనోజ్ తో వివాదంపై.. విష్ణు ఓపెన్ కామెంట్స్..!

తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వివాదాల కారణంగా ఈ కుటుంబం రోడ్డు కక్కింది అన్నదమ్ములు మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య ఇష్యూ మరింత చల్లరేగడంతో.. రాష్ట్రంలో వీళ్ళ వివాదం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలై.. ఇప్పుడు డైరెక్ట్‌గానే ఓపెన్ కామెంట్స్ చేసుకునే రేంజ్ కు ఎదిగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు.. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే పతనాన్ని కోరుకుంటున్నారని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దానికి బదులు మంచు మనోజ్.. భైరవం ఈవెంట్‌లో మాట్లాడుతూ.. కట్టుబట్టలతో రోడ్డుపై నుంచో పెట్టారు. కట్టేకాలే వరకు నేను మోహన్ బాబు కొడుకుని అంటూ చెప్పుకొచ్చాడు.

Manchu family dispute: Everything you need to know - Bigtvlive English

అంతేకాదు శివయ్య అంటే శివయ్య రాడని.. ఇలాంటి అభిమానులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలో శివయ్య వస్తాడంటూ సెటైరికల్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తర్వాత అలా అన్నందుకు మనోజ్ క్షమాపణలు కూడా తెలిపారు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. కన్నప్ప గురించి.. కుటుంబంలోని వివాదాల గురించి.. విష్ణు రియాక్ట్ అయ్యారు. దీంతో విష్ణు కామెంట్స్ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి. విష్ణు మాట్లాడుతూ.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం నాకు ఇష్టమని.. అందుకే విఎఫ్‌ఎక్స్ కోసం సరైన నైపుణ్యం లేని వ్యక్తిని తీసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ వెల్లడించాడు. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా ఆలస్యమైందని అనుకున్న టైంకి సినిమాను రిలీజ్ చేసేందుకు మా టీం కృషి చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చాడు.

అలానే.. తనికెళ్ల భరణి చెప్పిన కన్న‌ప్ప కథ నచ్చడంతో ఈ ఐడియా విదేశీయులతో కలిసి మరింత డెవలప్ చేసి రూపొందించామని చెప్పుకొచ్చాడు. మొదట రూ.100 కోట్ల బడ్జెట్ లోపే సినిమాల రూపొందించాలని అంచనా వేశాం. కానీ.. ఖర్చు డబల్ అయిందంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక తమ్మరెడ్డి భరద్వాజ్ రియాక్ట్ అవుతూ.. మంచు కుటుంబంలో గొడవలు బాధాకరం.. వాటిని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.. అందుకు నేను పెద్దరికం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. దానికి విష్ణు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. సూచనలు తప్పకుండా పాటిస్తానని వివరించాడు. కన్నప్ప సినిమా జూన్ 25న ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.