సౌత్ స్టార్బ్యూటీ సిమ్రాన్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో స్పెషల్ క్యామియో రోల్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. ఆడియన్స్లోను అమ్మడి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది సిమ్రాన్. కాగా ఈమె విలన్ పాత్రలో నటించిన సినిమాలు సైతం ఉన్నాయి. అవార్డుల వేడుకలో సిమ్రాన్ కు బెస్ట్ విలన్ అవార్డు సొంతమైంది.
ఈ క్రమంలోనే అవార్డును అందుకున్న సిమ్రాన్.. వేదికపై ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. తెలుగుతో పాటు తమిళ్ సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి.. అసలు ఏం జరిగింది.. ఒకసారి తెలుసుకుందాం. సిమ్రాన్ స్టేజ్ పై మాట్లాడుతూ.. ఇటీవల నేను ఓ నటికి మెసేజ్ చేశానని.. అటువంటి పాత్రలో ఆమెను చూసి షాక్ అయ్యానని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆంటీ రోల్ చేయడం కంటే అది బెటర్ అని రిప్లై వచ్చిందని.. సహనటి తోటి హీరోయిన్ అయి ఉండి కూడా అలాంటి రిప్లై తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని సిమ్రాన్ అసహనం వ్యక్తం చేసింది.
అదే వేదికపై తను మాట్లాడుతూ డబ్బా రోల్స్ చేయడం కంటే.. ఆంటీగా నటించడం.. పాతికేళ్ళ అమ్మాయికి తల్లిగా కనిపించడం చాలా బెటర్ అంటూ సిమ్రాన్ వెల్లడించింది. ప్రస్తుతం సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో ఈమె జ్యోతికను ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేసింది అంటూ.. మరి కొంతమంది లైలాను ఉద్దేశిస్తూ సిమ్రాన్ అసహనం వ్యక్తం చేసిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సిమ్రాన్ టార్గెట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరనేది.. తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలయ్యింది. దీనిపై సిమ్రాన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
simran respect ! 🫡 pic.twitter.com/F9uYtu1ODY
— Rohit Rakshan (@highondelulu) April 19, 2025