ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్లో మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. ఇక సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన టీం ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ వీడియోకు అభిమానులతో పాటు.. నెటిజనులలోను నెగటివ్ రియాక్షన్ రావడం.. విమర్శలు కురవడంతో.. సినిమాను పోస్ట్ పోన్ చేశారు టీం. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు వర్కౌట్ కాలేదని.. అసలు చిరు సినిమాకు ఇంత చెత్త గ్రాఫిక్సా అంటూ సాధరణ ఆడియన్స్తో పాటు.. మెగా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ఫై ఫోకస్ చేసిన టీం.. ఈసారి ఆడియన్స్ను ఎలా అయినా మెప్పించాలని ఉద్దేశంతో కేవలం విఎఫ్ఎక్స్కే భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఏకంగా విఎఫ్ఎక్స్ కోసం.. రూ.75 కోట్ల మేర ఖర్చు పెడుతున్నారట. హాలీవుడ్ సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తున్నారని.. దేశంలోనే రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో విశ్వంభర ఒకటిగా నిలవనుందని తెలుస్తుంది. ఇక.. ఇందులో చిరంజీవి కారణజన్ముడుగా కనిపించనున్నాడని టాక్. విశ్వంభర అనే లోకానికి, కారణజన్ముడికి పుట్టిన మానవుడికి మధ్య సంబంధం ఏంటి.. అనేది ఈ కథ అని తెలుస్తోంది.
ఆషికారంగనాథన్, ఇషా చావ్లా, సురభి పురానిక, పునాల్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. త్రిషా హీరోయిన్ గా .. చోటా కె నాయుడు సినిమా ఆటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మొదట్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అంచనాలన్నింటిని అదహ్ పాతాళానికి తొక్కేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విశ్వంభరపై జనంలో అసలు హైప్ లేదనడంలో అతిశయోక్తి లేదు. కాగా సినిమా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత టీం వైవిద్యంగా ప్రమోషన్స్ చేసి ఆడియన్స్లో సినిమాపై హైప్ను పెంచితేనే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి విశ్వంభర ప్రమోషన్స్ విషయంలో టీం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. బ్రేక్ ఈవెన్ అవుతారో లేదో వేచి చూడాలి.