స్టార్ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రెటీల జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నెటింట వైరల్గా మారుతూ ఉండే వేణుస్వామి.. కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల విషయంలో ఎన్నోసార్లు సెన్సేషనల్ జాతకాలను చెబుతూ వైరల్ అయిన ఆయన.. ఎక్కువగా ప్రభాస్కు వ్యాధులు ఉన్నాయని.. విజయ్, సమంత సూసైడ్ చేసుకుంటారని.. జ్యోతిష్యం చెప్పాడు.
గతంలో కూడా వేణు స్వామి.. చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ సమయంలో వీళ్ళు విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు వెళ్ళడంతో మహిళా కమిషన్ ముందు హాజరైన వేణు స్వామి.. మరోసారి జ్యోతిషం చెప్పనంటూ వివరించాడు. బహిరంగంగా సారి చెప్పాడు. ఇలా ఓసారి సమస్య ఎదుర్కొన్న ఆయనలో మాత్రం కాస్త కూడా మార్పు రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మరోసారి సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.
విశ్వావసూ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్లు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని జ్యోతిష్యం చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మీనరాశిలో ఈసారి సస్టాగ్రహ కూటమి ఏర్పడుతుందట. దీని ప్రభావం వల్ల తులా, మీన, మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన సెలబ్రిటీలు చిక్కుల్లో పడతారని.. జైలుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశాడు. ఈ రాశుల్లో ఉన్న సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలంటూ.. లైఫ్లో ఆచితూచి అడుగులు వేయాలని వేణు స్వామి వెల్లడించాడు. ఈ క్రమంలోనే వేణుస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి.