సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ ఎఫైర్, ప్రేమ, బ్రేకప్ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. కొంతమంది డైరెక్టర్లు, హీరోయిన్ల మధ్య ప్రొడ్యూసర్లు, హీరోయిన్ల మధ్యలో కూడా ఎఫైర్ వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కాగా సిట్టింగ్ కోసం చాలామంది దర్శకులు విదేశాలకు వెళ్లి.. అక్కడ కొత్తగా ఆలోచనలు చేసి.. కథలను పూర్తిచేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత హీరో, హీరోయిన్లకు వినిపిస్తూ ఉంటారు. ఇలాంటి దర్శకులలో సీనియర్ డైరెక్టర్ వంశీ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన వంశీ.. 1982లో మంచు పల్లకి సినిమాతో దర్శకుడుగా మారాడు.
తర్వాత సితార సినిమాతో జాతీయ అవార్డుని దక్కించుకున్నాడు. అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, అలాపన, లేడీస్ టైలర్, మహర్షి, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, డిటెక్టివ్ నారద, జోకర్, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. ఇలా ఎన్నో సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించాడు. కాగా గతంలో ఓ కథ సిట్టింగ్ కోసం వెళ్ళిన వంశీ అక్కడ తాను ఎదుర్కొన్న షాకింగ్ సంఘటనను తాజాగా షేర్ చేసుకున్నాడు. బ్యాంకాక్ లో ఆయన ఓ హోటల్ లో దిగాను అని.. అక్కడ రూమ్ కి వెళ్ళగా నాతో వచ్చిన ఓ రైటర్ చెప్పిన మాటకి ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు. డైరెక్టర్ వంశీ నాతో పాటు అక్కడకు వచ్చిన ఓ యంగ్ రైటర్ రూమ్ చూపించి ఈ రూమ్లో ఫలానా డైరెక్టర్ ఒక రాత్రంతా ఐదుగురు అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడంటూ చెప్పుకొచ్చాడని వివరించాడు.
అది వినగానే నాకు చాలా చిరాకు వచ్చిందని.. నాకు అసలు నచ్చలేదు.. అతని మాటలు తీసుకోలేకపోయాను.. వెంటనే అలాంటి రకం డైరెక్టర్ని నేను కాదు.. నాకు హీరోయిన్ల పై గౌరవం ఉంటుంది. హీరోయిన్ల విషయంలో కానీ.. అమ్మాయిలు విషయంలో కానీ.. మానసికమైన అభిమానమే తప్ప.. దానికి మించి ఎప్పుడు ముందుకు వెళ్లలేదంటూ వంశీ వివరించాడట. ఈ క్రమంలోనే అయినా మరో స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన ఈ షాకింగ్ విషయాన్ని రివీల్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయాని తాను చెప్పలేదు.