సాయి పల్లవికి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా తెలుగులో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్న‌ ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.గ్లామరస్ పాత్రల‌కు దూరంగా ఉంటూ.. త‌న రోల్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూంది. ఈ క్ర‌మంలోనే తనదైన న‌ట‌న‌తో పాటు.. తన వ్యక్తిత్వం, మాట తీరుతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కోట్లాదిమంది కుర్రకాలను ఫిదా చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా అమరాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya's performance in Thandel will melt our hearts – Allu Aravind  | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెర‌కెక్కనున్న తండేల్‌ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా తండేల్‌ సినిమా ట్రైలర్ లంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించారు. ఇక ఈవెంట్‌లో సాయి పల్లవి హాజరు కాలేదు. దీనిపై నిర్మత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సాయి పల్లవికి ఆరోగ్యం బాగాలేక‌ ట్రైలర్ లాంచ్‌కు రాలేకపోయిందని.. ఆమెకు కళ్ళు తిరగడంతో డాక్టర్‌కు చూపించగా ప్రయాణాలు వద్దని వెల్లడించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందని తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె అనారోగ్యానికి కారణం ఏమై ఉంటుంది.. అసలు ఏం జరిగిందే అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

Happy Birthday Sai Pallavi: Watch actor dub her own lines in Kannada for  Gargi for the first time - Hindustan Times

కాగా.. సినిమా పనులను ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్న టీం ఇటీవల సాయి పల్లవి డబ్బింగ్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి తనకు జ్వరం వచ్చిన సరే జ్వరంతోనే మూవీ డబ్బింగ్ చెప్తున్నాను అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే నాగ చైతన్య కెరీర్ లోనే ఒక్కింత‌ హైయెస్ట్ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో చైతు కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్ కనబరిచారని.. సాయి పల్లవి ఎప్పటిలాగే తన అద్భుతమైన న‌ట‌న‌తో ఆకట్టుకుంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజ‌జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.