ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతమంది హీరోయిన్స్ అడుగుపెడుతూ స్టార్ బ్యూటీలుగా రాణిస్తారు. మంచి ఫామ్లో ఉన్న టైంలో.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతారు. అలాంటి వారిలో.. నిన్న, మొన్నటి వరకు పూజా హెగ్డే, తమన్నా, సమంత వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోగా.. ఇప్పుడు అడపాదడపా సినిమా తీస్తున్నారు. అయితే వీళ్ళ తర్వాత వచ్చిన శ్రీ లీల, కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ క్రేజీ బ్యూటీ లుగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లే వారు మారుమొగాయి. అయితే వరుస ఫ్లాప్లు పలకరించడంతో వీళ్ళ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. కానీ.. ఇప్పుడు ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మాత్రం ఎక్కడా తగ్గేదెలా అంటూ సందడి చేస్తుంది. 2024 లో ఈ అమ్మడి నుంచి ఒక్క సినిమా రాలేదు.
కేవలం.. విజయ్ దళపతి గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మాత్రమే స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. 2025 లో మాత్రం బిజీ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ అమ్మడు మరెవరో కాదు.. తెలుగు, తమిళ, మళయాళ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న త్రిష. ప్రస్తుతం ఏకంగా ఈ ఏడాదిలో ఆరు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. పైగా ఈ ఆరు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. అలా ఈ ఏడాది మొదట స్టార్ హీరో అజిత్ నటించిన విడముయర్చితో ఆడియన్స్ను పలకరించనుంది.
ఈ సినిమాకు మిస్ తిరుమేని దర్శకత్వం వహించారు. అంతేకాదు.. ఈ సినిమాతో పాటు అజిత్ నటించిన మరో మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ లోను త్రిష హీరోయిన్గా మెరవనుంది. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తోరకెక్కనున్న ఈ సినిమాకు పుష్ప ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక కమలహాసన్ హీరోగా, మణిరత్నం డైరెక్షన్లో రానున్న మూవీలో త్రిషనే హీరోయిన్గా కనిపించనుంది. సూర్య 45లోను త్రిష హీరోయిన్. వీటితో పాటు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో సందడి చేయనుంది. అలాగే మలయాళం లో టెవిన్ థామస్తో ఐడెంటిటీ అనే మరో సినిమాలో కనిపించనుంది.