సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లుఅర్జున్ అరెస్ట్ రోజు రోజుకు మరింత దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై తాజాగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. బన్నీతో పాటు.. తెలుగు ఇండస్ట్రీపై కూడా ఘాటు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి రియాక్ట్ అయ్యాడు. థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలని నూరు శాతం అబద్ధాలు అంటూ చెప్పినా అల్లు అర్జున్.. మానవత్వం లేని మనిషిగా నన్ను చూపిస్తున్నారని.. రోడ్ షో, ర్యాలీగా వెళ్లాను అనడం నిజంగా దారుణం.
అనుమతి లేకుండా వెళ్తే పోలీసులు వెనక్కి పంపాలిగా.. చిరంజీవి, ఇతర హీరోల అభిమానులు మరణించినప్పుడు నేను ఎన్నోసార్లు పరామర్శించా.. నా అభిమాని మరణిస్తే పరామర్శించాలని నాకు ఉండదా.. లీగల్ ఇబ్బందుల కారణంగా శ్రీ తేజను నేను కలవలేకపోతున్నా.. 15 రోజులుగా బాధలోనే ఉన్నా. పుష్ప 2 సక్సెస్ మీట్ కూడా రద్దు చేసుకున్నా. తొక్కిసులాట ఘటనలో నా నిర్లక్ష్యమే కారణం అనడం నేను అసలు ఒప్పుకోను అంటూ రియాక్ట్ అయ్యారు. నూటికి నూరు శాతం అవన్నీ అబద్దాలేనని క్లారిటీ ఇచ్చాడు.
జాతీయ స్థాయిలో నా క్యారెక్టర్ ను దెబ్బతీసేలా దుష్ప్రచారాలు చేస్తున్నారని అభివర్ణించాడు. పోలీసుల అనుమతి లేకుండా తను థియేటర్ కి వెళ్లినట్టు.. తొక్కేసులాట తర్వాత పోలీసులు సూచనలు పెడచెవిన పెట్టి రోడ్ షో చేసాడని.. వస్తున్న ఆరోపణలను అల్లు అర్జున్ ఖండించాడు. తనను మానవత్వం లేని మనిషిగా చూపిస్తున్నారని.. అది నిజంగా బాధాకరం. సమాచార లోపం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన విమర్శల క్రమంలో శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి.. అల్లు అర్జున్ ఈ విషయాలను వెల్లడించాడు. తాజా పరిణామాలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు.