టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇలాంటి క్రమంలో పాన్ వరల్డ్ రేంజ్ లో తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చుకుంటున్న మహేష్.. శరీరంపై కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఎస్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు.. ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ కూడా నటించనున్నాడని.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మహేష్ బాబు.. గౌతమ్ కృష్ణను సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే గౌతమ్ చదువులో పూర్తి బిజీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. మహేష్, గౌతమ్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాల్లో గౌతమ్ను కూడా ఒక క్యారెక్టర్ చేయించాలని మహేష్ భావించినట్లు సమాచారం. ఇక గతంలోనే మహేష్, గౌతమ్ కలిసి వన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. కానీ.. జక్కన్న చేస్తున్న ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్లో చేసినా.. గౌతమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మంచి స్టేజ్ ల ఉపయోగపడుతుందని.. మరికొద్ది సంవత్సరాల తర్వాత తన కొడుకుని ఫుల్ టైం హీరోగా పరిచయం చేయడానికి మంచి స్కోప్ ఉంటుందని ఉద్దేశంతో మహేష్ బాబు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై మాత్రం రాజమౌళి అఫీషియల్ ప్రకటన ఇవ్వడం లేదు. ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్ నడుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా తరికేక్కుతుందంటే దానికి భారీ సక్సెస్ రేట్ ఉంటుందన్నంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి, మహేష్ కాంబో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఇలాంటి క్రమంలో గౌతం కూడా ఈ సినిమాలో నటిస్తే నిజంగా అతన్ని కెరీర్ కు ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.