స్టార్ బ్యూటీ సమంత – నాగచైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ జంట.. విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరు పేర్లు మరింత పాపులర్ గా మారాయి. విడాకులు తీసుకొని ఇంతకాలం అవుతున్న ఇప్పటికీ వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. పసుపు దంచే పనులు ప్రారంభమైనట్లు కూడా ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా పిక్స్ ని షేర్ చేసుకుంది హీరోయిన్ శోభిత. ఇక త్వరలో వీరి పెళ్లి కూడా జరగనుంది.
ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని.. ఈ ఏడాది డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో సమంత.. నాగచైతన్యకు లీగల్ నోటీసు ఇచ్చిందంటూ వైరల్ గా మారుతున్నాయి. సమంత, నాగచైతన్య కలిసి ఉన్న క్రమంలో ఇద్దరు కలిసి ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి తమ అభిరుచికి తగ్గట్టుగా దానిని మోడల్ చేయించుకుని.. ఆ ఇంట్లోనే కాపురం ఉన్న సంగతి తెలిసిందే. వారు విడిపోక ముందు వరకు ఆ ఇంట్లోనే కలిసి ఉన్నారు. అయితే ఈ ప్లాట్ ను కొనుగోలు చేసే టైంలో నాగచైతన్య కంటే ఎక్కువగా సమంతనే ప్లాట్పై ఇన్వెస్ట్ చేసిందట. ఆ ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేసి.. చైతుకు లీగల్ నోటీసులు పంపించనుందని సమాచారం.
దానికి కారణం సమంతతో వివాహమైన తర్వాత ఆ ఫ్లాట్లోనే చైతు కాపురం ఉండనున్నాడని, శోభితకు ఆ ఫ్లాట్ రాసి ఇచ్చేయడానికి కూడా చేతూ సిద్ధపడ్డాడు అంటూ సమాచారం. ఈ క్రమంలోనే అంతగా ఖర్చుపెట్టి మరి నాకు కూడా నచ్చినట్లు ఆ హౌస్ను డిజైన్ చేస్తే.. ఇప్పుడు వాళ్ళు ఎవరికో రాసి ఇచ్చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ.. సమంత తన సన్నిహితులతో చర్చించిందట. ఈ విషయంపై సమంత.. నాగచైతన్యకు లీగల్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవ్వడంతో.. సమంత చేస్తుంది కూడా కరెక్టే. తాను కూడా ఎంతో ఇష్టపడి కొన్న ఆ ఇంటిని శోభితకు.. చైతు రాసిపడానికి ఏం హక్కు ఉంది అంటూ నాగచైతన్య పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.