మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎవరికీ ఏ సాయం కావాలన్నా మొదటి వరుసలో ఉండే ఉపాసన.. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్కి సహాయం చేసిన న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలతో పాటు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుందన సంగతి తెలిసిందే.
అంతే కాదు ఆమె సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటుంది. ఇక మూగజీవులపై చూపించే ప్రేమ అసాధారణమైనది. ఈ క్రమంలోనే ఇటీవల ఏమే మూగజీవుల కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్.. అనే ఎన్జీవోని కూడా ప్రారంభించింది. ఈ ఎన్జీవోకి విరాళాలు స్వీకరిస్తూ పశు సంరక్షణ కోసం ఉపయోగిస్తున్న రేణు దేశాయ్.. ఇటీవల గ్లోబల్ స్టార్ చరణ్, సతీమణి ఉపాసన సంస్థల నుంచి కూడా విరాళాని పుచ్చుకుంది. ఈ సంస్థ కోసం అంబులెన్స్ కావలసిన విరాళం ఉపాసన రేణు దేశాయ్కి అందించింది.
అది కూడా ఉపాసన తమ పెట్ డాగ్ రైమ్ పేరుతో ఈ సహాయాన్ని చేసింది. ఈ క్రమంలోనే ఇష్ట వేదికగా రేణు దేశాయ్ ఉపాసనన్ని ట్యాగ్ చేస్తూ అంబులెన్స్ కొనుగోలు చేయడానికి ఎంతో పెద్ద హృదయంతో స్పందించిన రైమ్కు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెటింట వైరల్గా మారుతుంది. ఈ క్రమంలో ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.