అల్లు, మెగా కుటుంబాల వార్ తారాస్థాయిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. చాలాకాలం నుంచి వీరిమధ్య ఉన్న విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి లావా ఎగసిపడినట్లుగా బయటకు వచ్చాయి. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ జనసేన అధినాయకుడుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.. కాగా పవన్కు సపోర్ట్గా ట్వీట్ ద్వారా సరిపెట్టి, నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా స్వయంగా అక్కడికి వెళ్ళిమరి మద్ధతుగా నిలిచాడు అల్లు అర్జున్. దీంతో ఒక్కసారిగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య విభేదాలు గుప్పుమన్నాయి.
అల్లు అర్జున్ అనుమతి లేకుండా ప్లాన్ చేసి మరీ ర్యాలీ చేశారంటూ పోలీసులు కేసు పెట్టడంతో.. ఆ కేసు కొట్టేయాలంటూ ఇటీవల ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై తీర్పు త్వరలో వెలువడనుంది. ఇలాంటి టైంలో పుష్ప2 ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా.. నిర్మాతలు డిసెంబరు 5కు రిలీజ్ ప్లాన్ మార్చారు. అప్పుడు కూడా మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పవని, సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తారని భావించిన బన్నీ అందుకు తగ్గటుగా మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశారు. అల్లు హీరోలదే పై చేయి అనేలా ప్రపంచవ్యాప్తంగా పుష్ప2ను 11,500 థియేటర్లలో విడుదల చేసేలా స్కెచ్ వేశారు.
దీనివల్ల మొదటి మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగివచ్చే ఛాన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసే వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని సినిమా లాస్ లేకుండా సేఫ్గా బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని భావించారు. సినిమాకు హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా తన స్టామినాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కదెబ్బతో అన్నిటికి సమాధానం ఇచ్చినట్లుంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నారట. ఇండియాలో 6,500 థియేటర్లలో, విదేశాల్లో 5,000 థియేటర్లలో విడుదలవుతుండటంతో నష్టాలకు తావులేకుండా ప్లాన్ చేశారు. ఈ సినిమాతో మెగా హీరోలకంటే అల్లు హీరోదే పైచేయి అని నిరూపించే ప్రయత్నాల్లో బన్ని ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.. ప్లాన్ సక్సస్ అవుతుందా లేదా వేచి చూడాలి.