సరైన కాంబోలో సినిమా సెట్ అవుతుంది అంటే సినిమా మార్కెట్ గురించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టక ముందే ప్లానింగ్ లో సినిమా ఉండగానే.. డిజిటల్ ప్లాట్ ఫామ్లు ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్స్ వేచి చూస్తూ ఉంటారు. అదే ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో సినిమా రూపొందుతుందంటే.. ఇక ఓటీటీల సమస్య ఉండదు. అలా మైత్రి మూవీ మేకర్స్ ప్రెస్టీజియస్ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
హనురాగపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా భారీ పాన్ ఇండియన్ మూవీ రూపొందుతుంది. సినిమా ఓటీటీ అండ్ డిజిటల్ హక్కులను అప్పుడే ప్రముఖ సంస్థ విక్రయించేసినటు సమాచారం. ఈ కాంబోలో రాబోతున్న మూవీ ఇండియా డిజిటల్ హక్కులు రూ.150 కోట్లకు అమ్ముడుపోయాయట. నాన్ ధియేటర్ హక్కులలో మేజర్ షేర్.. డిజిటల్ రైట్దే అని తెలుస్తుంది. ఇవి కాకుండా సాటిలైట్, ఆడియో, హిందీ హక్కులు అన్నిటి పైన మరో రూ.150 కోట్లకు పైగా షేర్లు వచ్చే అవకాశం ఉంది.
అలా చూస్తే నాన్ థియెట్రికల్ హక్కులే దాదాపు రూ.300 కోట్లకు పైగా సినిమాకు వచ్చేస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమా అంటే రిలీజ్ కు ముందే థియెట్రికల్ బిజినెస్ ఎలాగూ సెన్సేషనల్ రేంజ్ లో ఉంటుంది. నటీనటుల రెమ్యూనరేషన్, పిరియాడిక్ డ్రామా కావడంతో సెట్, సీజీ వర్క్స్ విషయంలో నిర్మాణ వ్యయం కూడా అదే రేంజ్లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమా కావడంతో చివరకు ఏదేమైనా మైత్రి సంస్థకు భారీ లాభాలు తప్పవట.