టాలీవుడ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లకు ఏ.యం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించే ఛాన్స్ కొట్టేయడంతో.. ఏ.యం జ్యోతి కృష్ణ పాస్ట్ ప్రాజెక్ట్స్ గురించి అభిమానులు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన డైరెక్షన్లో తమన్నా, ఇలియానా హీరోయిన్గా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా రూపొందిందని.. సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిందని న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆగిపోవడానికి కారణం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం.
2006లో తమన్నా, ఇలియానా కాంబోలో ఏ.యం జ్యోతి కృష్ణ దర్శకుడిగా జాదు మూవీ రూపొందింది. 7జి బృందావన్ కాలనీ హిట్ తర్వాత.. కొడుకు రవికృష్ణ హీరోగా ఓ భారీ బడ్జెట్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఏ.యం రత్నం. ఈ సినిమాకు ఆయన పెద్ద కొడుకు ఏ.యం జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. ఇది ఆయన మొదటి సినిమా. తమిళ్లో కేడి, తెలుగులో జాదూ పేర్లతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హీరోయిన్లుగా తమన్నా, ఇలియానా ఇద్దరు కోలీవుడ్కు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు వర్షన్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలో తెలుగు వర్షన్ లో ట్రైలర్తో పాటు.. పలు సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పాయి.
కాగా.. మొదట తమిళ్ వర్షన్ సినిమాను రిలీజ్ చేసిన మేకర్స్.. తెలుగు వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో.. దానిని హోల్డ్ లో పెట్టారు. అయితే తమిళ్లో కేడీ పేరుతో రిలీజై డిజాస్టర్ గా నిలవడంతో.. తెలుగు వర్షన్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. దాదాపు అప్పట్లోనే రూ.5 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాకు.. ఏ.యం. రత్నం భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ నుంచి సినిమా వస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలపై ఆడియన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.