ఓ సినిమాకు రూ. 1500 కూడా పెట్టలేరా.. టికెట్ రేట్స్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సామాన్యుల నుంచి వస్తున్న ఒకే వాదన టికెట్ల రేట్ల పెంపు. దీనిపై ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో చర్చలు వినిపిస్తూనే ఉంటాయి. అధిక ధరలు, థియేటర్ వద్ద తినుబండారాలా ధరలపై ఎప్పటికప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. మరోపక్కన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దీంతో ప్రొడ్యూసర్ బ్రతకాలి అన్న దానికి తగ్గట్లుగా రేట్లు ఉండాలని మేకర్స్ వాదన. ఈ క్రమంలో టాలీవుడ్ లో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే నెల రోజులు ముందుగానే ఈ సినిమా టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడి పర్మిషన్లు తెచ్చుకుంటూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా దేవర తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ టికెట్ రేట్ల‌ పెంపుపై రియాక్ట్ అయ్యారు.

రూ.1500 ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఆయ‌న కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నాగవంశీ.. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ రేట్లు ఇప్పటికీ కూడా తక్కువగానే ఉన్నాయి అంటూ వెల్లడించారు. ఓ ఫ్యామిలీలో నలుగురు సినిమాకు వెళ్తే సింగిల్ స్క్రీన్ లో టికెట్ కి రూ.250 అవుతుంది. అలా చూస్తే ఫ్యామిలీకి రూ.1000 అవుతుంది. పాప్కాన్, కూల్డ్రింక్స్ రూ.500 అనుకున్న రూ.1500 ఖర్చు పెడితే సినిమాను లగ్జరీగా చూడొచ్చు. అంత తక్కువ ధరలో ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ మరి ఎక్కడ దొరకదు అంటూ నాగ‌వంశీ చెప్పుకొచ్చాడు. ఇక ఆంధ్ర, తెలంగాణనే కాదు యూఎస్ లోను ఇదే రేటుకు మూడు గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మరో ప్లేస్ ఉందా అంటూ ప్రశ్నించారు.

No change in Leo Telugu release date: Naga Vamsi | Telugu Cinema

షాపింగ్‌కి వెళితే ఇంతకు మించిన ఖర్చు కచ్చితంగా అవుతుందని.. అలా చూసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి రూ.1500 తో మూడు గంటలు ఎంటర్టైన్ చేయడంలో తప్పేంటి అంటూ ప్రశ్నించాడు. ఇప్పటికీ చీప్ గా జనాన్ని ఎంటర్టైన్ చేసేది సినిమా మాత్రమే అంటూ నాగవంశీ వెల్లడించాడు. ఇక భారీ బడ్జెట్ తో వ‌చ్చే సినిమా బ్రేక్ ఈవేన్‌ కావాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచాలని.. వంశీ చెప్పుకొచ్చాడు. మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ పెరిగిందని.. టికెట్ రేట్లు పెంచుతున్నాం.. సినిమాపై అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం గ‌నుక‌ దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి రేట్లు పెంచుకునే పర్మిషన్లు తెచ్చుకుంటున్నాం. దానివల్ల ప్రజలకు ఏమీ అన్యాయం జరగదు. నేను టికెట్ రేట్ రూ.1000 పెడితే అది నిజంగా పెద్ద తప్పే. కానీ.. దేవర సినిమాకు పెట్టింది రూ.250 ఫ్యామిలీ మొత్తానికి కలిపి వేయి అవుతుంది. అంతే కదా అంటూ చెప్పుకొచ్చాడు. నెలకు ఎవరైనా మహా అయితే రెండు లేదా మూడు సినిమాలు చూస్తారు. 20 సినిమాలు ఎవరు చూడరు అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన కామెంట్స్‌ వైరల్ అవడంతో కొందరు ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతుంటే.. మరి కొందరు మాత్రం నాగ‌వంశీని ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.