మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా మూవీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతుంది. ఇక గతంలో మల్లిడి వశిష్ట నుంచి వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన బింబిసారా కూడా సోషల్ ఫాంటసీ డ్రామా అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉందంటూ.. రెండు సినిమాలు ఒకే అంశంపై రూపొందుతున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటో ఒకసారి చూద్దాం.
మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర రెండు యుగాల మధ్యన కనెక్షన్తో రూపొందుతుందట. ఇక రెండు యుగాల మధ్యన కనెక్టివిటీ ఎలా ఉండనుంది..? అహంతో అన్యాయాలు చేస్తూ విర్రవీగుతున్న రాక్షసులను హీరో ఎలా హతమార్చాడు..? అనే అంశంపై సినిమా రూపొందుతుందట. ఇక గతంలో తెరకెక్కిన బింబిసారా కూడా ఇదే అంశంతో రూపందుతుందట. అయితే కథలో చాలా డిఫరెన్స్ ఉంటుందని.. ఈ సినిమాల్లో విఎఫ్ఎక్స్, అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్ గా ఉండనిందని సినిమాకు ఇది మరింత ప్లస్ కాబోతుందని తెలుస్తుంది.
ఇక విశ్వంభరలో యాక్షన్స్ సన్నివేశాలు కూడా భారీ లెవెల్ లో ఉంటాయని.. ఫ్యాన్స్ను మూవీ విపరీతంగా ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన రాలేదు. మొదట్లో సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పినా.. ఇప్పుడు కొడుకు గేహ్ఛేంజర్ కోసం చిరంజీవి విశ్వంభర పోస్ట్ పోన్ చేశారని టాక్. అయితే ఇప్పటివరకు విశ్వంభర రిలీజ్ డేట్ పై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.