నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ కేవలం మలయాళ సినిమాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆవిర్భవించాయి. కొన్ని ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరకెక్కిన సినిమానే మా నాన్న సూపర్ హీరో.. సినిమా అనేకంటే నవల అనడం కరెక్ట్ ఏమో. సుధీర్ బాబు తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పక్కన పెట్టి చేసిన ఈ సినిమా చూస్తున్నంత సేపు నవల చదువుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంతకీ సుధీర్ బాబు ప్రయత్నం ఫలించిందా.. లేదా.. సక్సెస్ అందుకున్నాడో.. లేదో.. ఒకసారి చూద్దాం.
(సాయిచంద్) ప్రకాష్ ఓ లారీ డ్రైవర్. అతని భార్య.. బిడ్డను కన్ని తండ్రికి అప్పగించి చనిపోతుంది. ఆ పిల్లాడి ఆలనా, పాలనా మొత్తం ప్రకాష్ చూసుకుంటాడు. మూడు రోజులు లారీ ఎక్కి బయటకు వెళ్లాల్సిన పని వస్తుంది. దీంతో ఈ మూడు రోజుల కోసం అనాధాశ్రమంలో వదులుతాడు. ప్రకాష్ అయితే అనుకోకుండా ఒక పోలీస్ కేసులో చిక్కుకొని జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే అనాధ పిల్లాడికి జానీ(సుధీర్ బాబు).. అని ఆశ్రమం పేరు పెడుతుంది. ఇక జానిని.. శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటారు. మొదట్లో జానీ ని ప్రేమగా చూసిన శ్రీనివాస్.. తర్వాత కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడంతో.. అన్ని జానీ వల్లే జరిగాయని అతనిపై ద్వేషం పెంచుకుంటాడు. అయితే జానీ మాత్రం తన నాన్ననే హీరోగా భావిస్తూ.. తన కోసమే బ్రతుకుతాడు. ఇక శ్రీనివాస్ ఊరంతా అప్పులు చేసి వాటిని తీర్చడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాడు.
ఈ క్రమంలోనే పొలిటిషన్ దగ్గర కోటి రూపాయలు బాకీ ఉండిపోతాడు. అతని తండ్రిని పొలిటిషన్ నుంచి కాపాడుకోవడానికి.. కోటి రూపాయలు సంపాదించడానికి.. జానీ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోగా ప్రకాష్ జైల్ నుంచి విడుదలవడం.. తన బిడ్డ ఎక్కడున్నాడో తెలియక వెతుక్కోవడం అంశాలతో.. కథ నడుస్తుంది. ఇక నవల అన్నట్లుగానే.. కథాంశం కూడా వెయిట్ తో ఉంటుంది. చేయని నేరం నెత్తి మీద వేసుకొని కొడుకు కి దూరమైనా ప్రకాష్.. కథ తో సినిమా ప్రారంభమై.. శ్రీనివాస్, జానీల మధ్య ఉండే బాండ్.. జానీకి తండ్రిపై ప్రేమ, దత్తపుత్రుడు అంటే ద్వేషం కూడా కనిపించేలాగా ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారు. అసలు కథ కంటెంట్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ లో క్లారిటీ ఇచ్చినా.. సెకండ్ హాఫ్ ను కీలకంగా చూపించాల్సి ఉంది. దీంట్లో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది.
సాధారణంగా తెలుగు సినిమాల్లో కొడుకు బలదుర్గ తిరుగుతుంటే.. తండ్రి బాధ్యతలు నేర్పించే విధంగా సినిమాలు రూపొందుతాయి. కానీ ఈ సినిమాలు తండ్రి చేసిన అప్పులను కొడుకు తీర్చుతూ.. బాధ్యతలు తండ్రికి చెప్తూ కనిపిస్తాడు. ఈ అంశాలు ప్రేక్షకులకు కాస్త డిఫరెంట్ గా అనిపించాయి. ఇక సెకండ్ హాఫ్ లో కథ మొత్తం కోటి రూపాయల లాటరీ.. డబ్బు కనిపించగానే మనుషుల్లో పెరిగే స్వార్థం, కుట్రలపైనే తిరిగింది. శ్రీనివాస్, జానీల బాండ్ బాగుంది. కానీ.. ప్రకాష్, జానీ ట్రావెల్ లో భావోద్వేగ సంఘటనలపై సరైన అంశాలను చూపించలేదు. ఈ ప్రయాణంలో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అసలు సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ ఎమోషన్సే కనిపించలేదు. అయినా స్టోరీ మధ్యలో రాజు సుందరం పాత్రను తీసుకువచ్చి ఎంటర్టైన్ చేయాలని ప్రయత్నించిన అది కూడా వర్కౌట్ కాలేదు. అసలు ఆ ఎపిసోడ్ ఉన్నా.. లేకపోయినా.. కథ పెద్దగా మారదు.
కేవలం కథను పొడిగించడానికి.. ఓ పాట పాడుకోవడానికి తప్ప అది దేనికి ఉపయోగపడలేదు. చివరి 20 నిమిషాలు ఎమోషన్స్ పిండియాలని ప్రయత్నించారు. కానీ.. అది ఫలించలేదు. అయితే క్లైమాక్స్కి ముందు సాయిచంద్ – జానీ మధ్యన జరిగిన డ్రామా కాస్త బెటర్ అనుభూతిని కల్పిస్తుంది. అలాంటి సన్నివేశాలు ఒకటి రెండు పడి ఉన్న కనీసం దర్శకుడు లక్ష్యం నెరవేరేది. దాదాపు సుధీర్ ఇప్పటివరకు సినిమాలు యాక్షన్ ప్రధానంగా సాగాయి. కానీ.. మొదటిసారి ఓ ఎమోషనల్ డ్రామాను సెలెక్ట్ చేసుకున్నాడు. తన వరకు ఇది కొత్త జానర్. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు గా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. షాయాజీ సిండేని ఈ తరహా పాత్రలో చూడడం కొత్త గా కనిపిస్తుంది.
పాత్రకు కట్టుబడి నటించిన పాత్ర నడివి కాస్త పెంచి ఎమోషన్ జోడిస్తే బాగుండేది అనిపించింది. సాయిచంద్ పాత్ర కూడా కీలకంగా ఉంది. ఎమోషనల్ కంటెంట్ అంతా ఈ పాత్ర చుట్టూనే తిరిగింది. చివర్లో సాయి చంద్ – సుధీర్ మధ్య సీన్ కాస్త పెంచి ఉంటే సినిమాకు హైలైట్ అయ్యేది. పాత్ర నడివి.. సన్నివేశాన్ని పెంచే స్కోప్.. ఉన్న దర్శకుడు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదు అర్థం కాదు. ఈ మూడు పాత్రలే సినిమాకు హైలెట్. హీరోయిన్ ఉన్న ఉపయోగం లేదు. అసలు ఆ పాత్రని ఎందుకు తెచ్చారా మధ్యలో ముంబై ఎందుకు పంపారు అర్థం కాదు. కదపరంగా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ పేపర్ పై రాసుకున్న భావోద్వేగాలను తెరపై చూపించడంలో డల్ అయ్యారు. అయినప్పటికీ ఇలాంటి కథను చూపించడం, తెరకెక్కించాలని ప్రయత్నించడం నిజంగా గొప్ప విషయం. ఎక్కడ కథ పక్కదారి పట్టలేదు. చెప్పాలనుకున్న పాయింట్స్ చూపించాడు. అసభ్యతకు తావు లేదు. మనసుని, మనిషిని కదిలించే సన్నివేశాలు కాస్త తక్కువ అయ్యాయి. లేదంటే సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకునేది.