బుల్లితెరపై యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటించి లక్షలాదిమందిని ఆకట్టుకునే రేంజ్కు ఎదిగింది యాంకర్ ఝాన్సీ. తన ఎనిమిదేళ్ల వయసులోనే రేడియో ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఝాన్సీ.. తర్వాత కొంతకాలానికి యాంకర్గా మారి ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్లో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడంటే సుమ, శ్రీముఖి, రష్మి అంటూ ఎంతోమంది యాంకర్స్ని రోజు టీవీల్లో చూస్తున్నాం కానీ.. ఒకప్పటి రోజుల్లో ఏ టీవీ పెట్టిన ఝాన్సీ మాత్రమే మనకు కనిపించేదనడంలో సందేహం లేదు. అలా బుల్లితెర ద్వారా వచ్చిన క్రేజ్తో సినిమాల్లో అవకాశాలు రాబట్టుకున్న ఝాన్సీ.. నటనలోను తన సత్తా చాటుకుని మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
మొదట యాంకర్ గా అలవాటు పడిన ప్రజలు నటిగా ఆమెను చూడాలంటే పెద్దగా ఇష్టపడరు. దీంతో వారికి ఊహించిన రేంజ్లో సక్సెస్ రాదు. అలాంటివారు ఎంతోమంది ఉన్నారు కూడా. కానీ ఝాన్సీ బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే సలార్లో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఈప్పట్లో కేవలం రెండే చానళ్లు.. దానికి నలుగురు యాంకర్స్ గా పోటీ పడేవారు.. అలాంటి సమయంలో నాకు లక్ ఇచ్చిన షో.. టాక్ ఆఫ్ ది టౌన్ అని చెప్తా.. ఆ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అందుకోవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. అదే టైంలో ఇండస్ట్రీలో తొక్కేయడానికి కూడా చాలా మంది చూశారు అంటూ వివరించింది.
ప్రారంభంలో అందరిలాగే నేను తప్పులు, పొరపాట్లు ఎన్నో చేశా. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగడం వల్లే ఇప్పుడు నేను ఈ స్టేజిలో ఉన్న అంటూ చెప్పుకొచ్చింది. నాకు ఏమైనా స్క్రిప్ట్ బాగోకపోతే.. బాగోలేదనిపిస్తే మార్పులు చేయించడం అలవాటు. వెంటనే స్క్రిప్ట్ బాలేదని చెప్పేస్తా. అది ఎంతో మంది డైరెక్టర్స్ కి నచ్చేది కాదు. అలా నాకు వచ్చే అవకాశాలను కూడా ఆపడానికి ఎంతో మంది ప్రయత్నించారు. నావల్ల గ్రాండ్ సక్సెస్ అయిన ఈవెంట్లకు కూడా నేను లేకుండా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు. అలా చాలామంది నన్ను ఇండస్ట్రీలో వాడుకుని వదిలేసారు అంటూ వెల్లడించింది ఝాన్సీ. ప్రస్తుతం ఝాన్సీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.