తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లతో పోటీపడే రేంజ్కు ఎదిగాడు సోగ్గాడు శోభన్ బాబు. సినీ కెరీర్ బ్లాక్ బస్టర్ అనే తరహాలో సాగకున్నా.. తను కూడా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరికతో ఏఎన్ఆర్ నటించిన కీలుగుఱ్ఱం సినిమాతో కెరీర్లు ప్రారంభించాడు. స్టూడెంట్ గా ఉన్న టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సినిమాలను ఇష్టంగా చూసేవాడినని.. మల్లేశ్వరి సినిమాను ఏకంగా 22 సార్లు చూసాను అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శోభన్ బాబు. తను సినిమాల్లోకి వచ్చినప్పుడు అవకాశాలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని వివరించారు.
చాలా సినిమాల్లో పాత్రలకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నన్ను రిక్వెస్ట్ చేశారని.. ఎన్టీఆర్ చాలా పౌరాణిక సినిమాల్లో తనకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఇద్దరిని నేను తరచుగా కలిసే వాడినని.. వాళ్ళు సహకారం లేకుంటే నేను నటుడుగా నిలబడగలిగే వాడినే కాదంటూ చెప్పుకొచ్చాడు. నర్తనశాల, వీరాభిమన్యు రెండు సినిమాలు నా కెరీర్ను మార్చేసాయని.. రెండు సినిమాల్లో అభిమన్యుడుగా నటించా, వీరాభిమన్యు అయితే అప్పట్లో సంచలనం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ విధివిచిత్రమైనది.. వీరాభిమన్యు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నాలుగైదు ఏళ్ల పాటు నాకు అవకాశాలే రాలేదు. రెండు సినిమాల్లో హీరోగా నటిస్తే ఆ రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. అప్పటికి నాకు పెళ్లై భార్య, పిల్లలు ఉన్నారు.
వాళ్లకు తిండి పెట్టడానికి చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి అంటూ శోభన్ బాబు వివరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చిన్న చిన్న వేషాల్లోనూ నటించాను. ప్రతిజ్ఞ పాలన అనే సినిమాలో నారదుడి పాత్ర కోసం రూ.750 రమేనరేషన్ తీసుకున్న, తర్వాత 700,1000 తీసుకుని చిన్న చిన్న సినిమాల్లో ఎన్నో నటించా. అలాంటి కష్టాలు అనుభవిస్తూనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఏఎన్నార్, ఎన్టీఆర్ తరహాలో పెద్ద హీరో కావడానికి ఎన్నో పాఠాలు నేర్చుకున్న.. వీరాభిమన్యు సినిమా నాకు గుర్తింపు తెస్తే.. నా కెరీర్ను మలుపు తిప్పిన సినిమా మనుషులు మారాలి అంటూ శోభన్ బాబు వివరించారు. 1969 లో వచ్చిన ఈ సినిమా నాకు హీరోగా ఫస్ట్ హిట్. ఈ సినిమాతో నా కష్టాలు తీరడమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ వచ్చింది అంటూ శోభన్ బాబు వివరించారు. 75వ దశకం నుంచి శోభన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగారు.