టాలీవుడ్ హీరోయిన్ అంజలికి తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఫోటో.. సినిమాతో మొదట టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత కొంతకాలం తెలుగు సినిమాలకు దూరమైంది. కన్నడ, తమిళ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని అక్కడ వరుస సినిమాలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్గా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అంజలీ హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ అంజలి లైమ్లైట్లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బహిష్కరణ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఓవైపు గ్లామర్తో పాటు.. మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని తన సత్తా చాటుతుంది. ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ లోనూ అంజలి నటించింది. తాజాగా ఈ సన్నివేశాలపై అమ్మడు స్పందిస్తూ.. ఈ సిరీస్లో అలాంటి సీన్స్ నటించేటప్పుడు సెట్ లో అందరిని బయటకు పంపి షూట్ చేసినట్లు వివరించింది. అయితే అలా చేసిన తాను కొంచెం గందరగోళానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తనకు మంచి పాత్రలే వచ్చాయని.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే నేను ఎంచుకుంటున్నాను అంటూ వివరించింది.
కొన్ని సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని.. యాక్షన్స్ సన్నివేశాలు కూడా డూప్ లేకుండా చేయగలను అంటూ వివరించింది. నవరస సిరీస్ చేసినప్పుడు ఎవరైనా అనుభవాన్ని అమ్మడు షేర్ చేసుకుంటూ.. కాస్టేమ్ సమస్య వల్ల కొన్ని గంటలు వాష్ రూమ్ కి వెళ్లలేకపోయానని వివరించింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడుతూ ఆ సినిమా మంచి సినిమా అని.. తన పాత్రకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ పాత్ర వరకే నేను న్యాయం చేయగలను.. సినిమా రిజల్ట్ విషయంలో నేనేమీ చేయలేను అంటూ వివరించింది. ప్రస్తుతం అంజలి చేసిన కామెంట్స్ నెట్టెంటా వైరల్ గా మారాయి.