టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఆడియన్స్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. తర్వాత వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ అందరికీ సడన్ షాక్ ఇస్తూ ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తను మరెవరో కాదు అలనాటి నటి మీనాక్షి శేషాద్రి.
1980లో హీరో, మేరీ జంగ్, దామిని లాంటి సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్బాంధవుడు సినిమాలో నటించింది. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. ఆపద్బాంధవుడు సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ను కూడా దక్కించుకుంది. అంతకుముందు తెలుగులో జీవన పోరాటం సినిమాలో ప్రత్యేక పాత్రలో ఆకట్టుకున్న మీనాక్షి.. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలోను కనిపించింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ వైపు మక్కువతో అక్కడకు మక్కాం మార్చేసింది. హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
తన అందం, అభినయంతో మెప్పించిన మీనాక్షికి అక్కడ అనుకున్న రేంజ్లో సక్సెస్ మాత్రం అందలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి మైసూర్కు చెందిన హరీష్ అనే వ్యక్తితో పెళ్లికి రెడీ అయింది. 1995లో వివాహం చేసుకున్న ఈ అమ్మడికి ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత మీనాక్షి భర్తతో కలిసి యుఎస్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పటికే అమెరికాలో డ్యాన్స్ స్కూల్స్ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సా లాంటి సాంస్కృతిక నృత్యాలు నేర్పిస్తున్న మీనాక్షి.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ ను షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇంట్లో చేసిన బొమ్మల కొలువులో ఆమె స్వయంగా పాట పాడి.. దానికి సంబంధించిన వీడియోలు నెటింట రిలీజ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మీనాక్షి శేషాద్రి టాలెంట్ పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.