మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చరణ్.. మొదట మెగాస్టార్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో నేహా శర్మ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా షూట్ మొత్తం బ్యాంకాక్ లోనే జరిగింది. ఇక ఈ సినిమా షూట్ టైంలో చరణ్ పుట్టినరోజు రావడంతో.. సురేఖ, చిరంజీవి బ్యాంకాక్ కొడుకుని చూడడానికి వెళ్లారట.
ఆ సమయంలో బ్యాంకాక్ లో చరణ్ను చూసిన సురేఖ ఎమోషనల్ గా ఫీల్ అయిందట. చరణ్ పేస్ అంతా బాగా ట్యాన్ అయిపోయి.. చాలా డల్గా కనిపించాడత. దీంతో సురేఖ కంటతడి పెట్టుకుందట. అయితే చిరంజీవి మాత్రం తన కొడుకు చాలా కష్టపడుతున్నాడని.. సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చిరుత సినిమా తర్వాత చరణ్ రాజమౌళి డైరెక్షన్లో మగధీర సినిమాల్లో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు.. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేస్తాడు. వాస్తవానికి చరణ్ మొదటి సినిమానే రాజమౌళి డైరెక్షన్ లో నటించాల్సింది.
అయితే జక్కన్న.. చరణ్ సెకండ్ సినిమాకు నేను దర్శకుడుగా వ్యవహరిస్తానని చెప్పడంతో చిరంజీవి కూడా దానికి అంగీకరించి పూరి జగన్నాథ్కు అవకాశం ఇచ్చాడట. ఇక తన మొదటి సినిమా నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న చరణ్.. తన సినీ కెరీర్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. నెపోటిజం కారణంగానే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడంటూ.. నటనే రాదంటూ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకుని.. ఆ కామెంట్లన్నింటికి చెక్ పెట్టాడు. రెమ్యునరేషన్ పరంగా టాప్లో దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ నటిస్తున్నాడట. ఇక ఓ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ఇక చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. మరిన్ని అవార్డులు తన సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.