రైల్వే గేట్ ప‌క్క‌న ఆ న‌టుడి డెడ్ బాడీ.. క‌న్నీళ్ళ ఆగ‌లేదు ముర‌ళీమోహ‌న్ ఎమోష‌న‌ల్..

జగమేమాయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సీనియర్ హీరో మురళి మోహన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాసరి నారాయణ డైరెక్షన్ లో వ‌చ్చి తిరుపతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. తర్వాత ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ జయభేరి గ్రూప్ సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ సమ‌యాల‌లో ఎవో ప్రమాదాలు జ‌ర‌గ‌డం.. గాయాలు పాల‌వ‌డం, ప్రాణాలు కోల్పోవడం సాధారణంగానే ప‌లు సంద‌ర్శాల‌లో జరుగుతూ ఉంటాయి. అలాంటివి దాదాపు బయటకు రావు.

రైల్వే ట్రాక్ పక్కన ప్రముఖ నటుడి డెడ్‌బాడీ..మురళీ మోహన్ ను వెంటాడిన రెండు విషాద సంఘటనలు | senior actor Murali Mohan made shocking Comments About kv chalam death - Telugu Filmibeat

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న న‌టుడు మురళీమోహన్.. తాను షూటింగ్లో పాల్గొన్న సమయంలో జరిగిన ఇలాంటి రెండు చేదు అనుభవాల గురించి అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. దాసరి నారాయణరావు డైరెక్షన్‌లో బంగారు అక్క మూవీ షూట్ లో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిందని.. అయితే ఆమె షూటింగ్ సమయంలో ఎక్కువగా పిల్లలతోనే ఆడుతూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఒకరోజు అవుట్‌డోర్ షూటింగ్ ఉండడంతో.. షూటింగ్లో లేని ఓ పాప కూడా వచ్చిందని.. మా లెక్కలో ఆ పాప పేరు లేదు. కానీ కొందరు వచ్చి మా పాప కనిపించడం లేదంటూ మమ్మల్ని అడిగారు. మేము ఆరోజు చెరువులో షూట్ చేశాం. దీంతో ఆరోజు చెరువు దగ్గర ఉన్న ప్రాంతమంతా వెతికాం.. మర్నాడు చెరువు మొత్తం గాలించగా పాప మృతదేహం దొరికింది. ఆ సంఘటన త‌లుచుకుంటే మనసు కలిచి వేస్తుందంటూ వివరించాడు.

Addala Meda Telugu Full Movie | Murali Mohan | Mohan Babu | Ambika - Movies on Google Play

అలాగే అద్దాలమేడ సినిమా షూటింగ్ టైంలో కె.వి చలం కూడా మాతో పాటు సినిమాలో నటించేవాడని.. కానీ ఒకరోజు ఆయన షూటింగ్ కు రాలేదంటూ వివరించాడు. మేము ఇంటికి కాల్ చేసి ప్రశ్నిస్తే షూటింగ్ కి నిన్నే వచ్చారు. ఇప్పటివరకు ఇంటికి రాలేదని చెప్పారని.. దీంతో గాలింపులు మొదలుపెట్టాం. కొద్దిసేపటికి ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ పక్కన డెడ్ బాడీ ఉందట‌.. అతన్ని కాస్ట్యూమ్ గురకలా ఉందని చెప్పడంతో ఇంటికి ఫోన్ చేసి చలం.. నిన్న ఏ బట్టలు వేసుకున్నాడని అడిగామ‌ని వివ‌రించాడు. కాకి బట్టలని వాళ్ళు చెప్పార‌ని.. దీంతో వెంటనే డెడ్ బాడీ చూడడానికి వెళ్ళాం. ఆ బాడీ చెలందే కావడంతో అందరికీ ఆశ్చర్యం.. కన్నీరు ఆగలేదు.. ఎంతో బాధించాం.. ఇప్పటికీ నాకు ఆ సంఘటన గుర్తుకు వస్తే చాలా బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయనకు అంత్యక్రియలు చాలా ఘనంగా చేశామని వివరించడం.. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.