ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఓ స్టార్ హీరోయిన్.. త్వరలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో వెండితెరపై మెరవనున్న ఈ అమ్మడు.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ సేటస్ దక్కించుకుంది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించి ఆడియన్స్ కు దగ్గర అయింది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటిగా పేరు ఉన్న ఈ అమ్మడు త్వరలోనే టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం కానుంది. అంతే కాదు ఈమె ఓ స్టార్ కిడ్. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మడు మొదట్లో నెపోటిజం విమర్శలను కూడా ఫేస్ చేసింది. కానీ రోజురోజుకీ తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం చేతినిండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ అమ్మడు వయసు 27 ఏళ్ళు. అయినా ఇప్పటికే వెయ్యి కోట్ల ఆస్తిని సంపాదించింది. తల్లిదండ్రులు ఆస్తులు కాకుండానే సొంతంగా ఎన్నో వ్యాపారాలు, బ్రాండ్ యాడ్స్ చేస్తూ కోట్లకు యజమానిగా మారింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా. ఎస్ ఆమే జాన్వి కపూర్. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు. ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మాహి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వి ఈ సినిమా హిట్ కావడంతో నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాలో కనిపించనుంది.
ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమా అవకాశాన్ని దక్కించుకున్న ఈ అమ్మడు.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నాల్లో ఉంది. ఇక శ్రీదేవి ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తండ్రి బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడి లైఫ్ స్టైల్ కూడా ఎంతో లగ్జరీగా ఉంటుంది. ప్రస్తుతం జాన్వి తన తండ్రి బోనికపూర్, చెల్లెలు ఖుషికపూర్ తో ముంబాయి బంధ్రాల్లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇటీవల కోబిలిస్క్ అనే భవనంలో రూ,65 కోట్ల విలువ చేసే డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసింది, అలాగే చెన్నైలో 15 ఎకరాల ఇల్లు ఐదు రకాల కాస్ట్లీ పెంపుడు కుక్కలు.. రూ.2.5 లక్షల విలువైన అమెరికన్ అకీటా డాగ్ కూడా ఉంది.