టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ సరసన పుష్ప సినిమాలో నటించి ఒక్కసారిగా పాన్ ఇండియన్ లెవెల్ లో నేషనల్ క్రష్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. శ్రీవల్లిగా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. కొన్ని పాత్రలో కొంతమంది నటులను చూస్తే ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం చాలా కష్టం. వాళ్లకోసమే అలాంటి పాత్రలు పుట్టాయ అనిపించేలా జీవించేస్తూ ఉంటారు. అలా పుష్పా సినిమాల్లో రష్మిక.. శ్రీవల్లి పాత్రలో తన అభినయంతో అదరగొట్టింది. సీమయాస, ఆహార్యంతో న్యాచురల్ గా కనిపించింది.
ఇక పుష్ప సీక్వెల్లోనూ అమ్మడు మరోసారి శ్రీవల్లిగా మెప్పించనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడప్పుడు ఈ సీక్వెల్ వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రష్మిక పుష్ప 2 తర్వాత మరోసారి సీమ సింగారం తోనే ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో ఓ పిరియాడికల్ మూవీ తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా రష్మిక దాదాపు ఫిక్స్ అయింది. ఇది పూర్తిగా రాయలసీమలోని కర్నూలు బ్యాక్ డ్రాప్ లో సాగే కథాంశం అని టాక్.
సీమ కథ అందులోను పిరియాడికల్ నేపథ్యం కావడంతో ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలు కూడా స్టోరీ సమయం అంతా అదే ప్రాంతాన్ని ప్రతిబింబించేలా కనబడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విశ్వసినీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీవల్లి పాత్ర నుంచి బయటకు వచ్చిన రష్మిక.. మరోసారి కూడా అదే సీమ పడుచు పాత్రలో కనిపించబోతుందట. దీంతో పుష్ప 2 తర్వాత మరోసారి వెండితెరపై సీమపడుచులా రష్మికను చూడాలనే కుర్రాళ్ళ ఆశ ఈ సినిమాతో నెరవేరనుందని వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ అనందన వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికందర్ ఇలా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుతుంది.