ఒక్కోక్కడికి పగిలిపోయే షాక్ ఇవ్వబోతున్న పూరీ..ఏం చేయబోతున్నాడో తెలుసా..?

పూరి జగన్నాథ్ .. ఏ నిర్ణయం తీసుకున్న సరే సంచలనంగా ఉంటుంది . అది అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలుగా ఉన్న అందరి హీరోలని ఇంట్రడ్యూస్ చేసింది ..వాళ్ళ కెరియర్ మార్చేసింది.. పూరి జగన్నాథ్ అని చెప్పుకోక తప్పదు . సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు ఎలాంటి సిచువేషన్ లో ఉన్నాడో కూడా మనకి తెలుసు .

లైగర్ సినిమాతో..భారీ భారీ డిజాస్టర్ ని అందుకున్న ఈ పూరి జగన్నాథ్ ఇప్పుడు రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . రీసెంట్గా పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . త్వరలోనే ఇడియట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడట. అయితే తేజ కి తండ్రి పాత్రలో అక్కినేని నాగార్జున నటించే విధంగా క్రేజీ ప్లాన్ చేశాడు పూరి జగన్నాథ్ అన్న వార్త వైరల్ అవుతుంది.

పూరీ జగన్నాథ్ ఇప్పటికే ఈ విషయంపై నాగార్జునతో కూడా చర్చించారట . ఇడియట్ సినిమాలో రవితేజ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో రవితేజ తండ్రి పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇడియట్ 2 లో తేజా సజ్జ – నాగార్జున తండ్రి కొడుకులుగా నటిస్తే సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటున్నారు జనాలు . ఈ సినిమా హిట్ అయితే ఒక్కొక్కడికి పగిలిపోవాల్సిందే అంటూ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!