దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ను తాజాగా వదిలింది చిత్రబృందం. ఈ పోస్టర్లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారులు సునీల్, నవీన్ చంద్ర, అంజలి, జయరామ్ మరియు ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు.
ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. మరో విషయం ఏంటంటే.. తాజా పోస్టర్ ద్వారా చరణ్ రోల్పై హిట్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్ లో రామ్ చరణ్ సూటు, బూటు, గ్లాసెస్ ధరించి జెంటిల్ లుక్ లో అదరగొట్టేశారు. అంతేకాదు, ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం కూడా మనం గమనించవచ్చు. దీనిని బట్టీ చూస్తుంటే.. చరణ్ ఈ మూవీలో యాంటీ కరప్షన్ ఆఫీసర్ రోల్ పోషించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.