డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు నేడు దగ్గుబాటి రానా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణ జరిపారు. నాలుగేళ్ళ కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో పలువురు సెలబ్రిటీలను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే నేడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ ముందుకు రానున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో రానా ను విచారించనున్నారు ఈడీ అధికారులు.

అయితే ఇప్పటికే విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు రానా కు నోటీసులు పంపిన విషయం మనందరికీ తెలిసిందే. మొదటిసారి సినీ తారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్నారు. 2017 లో జరిపిన ఎక్సైజ్ విచారణలో రానా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఈడి ముందుకు హాజరైన సంగతి మనందరికీ తెలుసు.