ఆ మ్యాటర్‌లో శోభన్ బాబు మనవడి క్రేజీ రికార్డ్.. ఏం చేశాడంటే..?

టాలీవుడ్ అందగాడు.. సీనియర్ స్టార్ హీరో శోభన్ బాబుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న శోభన్ బాబు వారసలుగా ఇండస్ట్రీలోకి ఎవరు అడుగు పెట్టకపోయినా.. ఇతర ఇతర రంగాల్లో సత్తా చాటుతున్నారు. శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన డాక్టర్ గా వైద్యరంగంలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే సురక్షిత వైద్యరంగంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళా గర్భాశయంలోని భారీ కణితని త్రీడీ లాప్రోస్కోపీ ద్వారా తొలగించి సంచలనం సృష్టించాడు.

8 గంటల సుదీర్ఘ శాస్త్ర చికిత్సతో అనస్తేషియా బృందం సహకారం ద్వారా రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 4.5 కిలోల గర్భాశయాన్ని సక్సెస్ఫుల్గా తొలగించాడు. అదే రోజున ఆమెను ఇంటికి కూడా డిశ్చార్జ్ చేశారు. చికిత్స 2019లో డాక్టర్ రాకేష్ సింహ స్థాపించిన 4.1 కిలోల గర్భాశయ తొలగింపు గిన్నిస్ రికార్డును అధిగమించడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సర్జరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం పరిశీలిస్తున్నారు. చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ స్థాపకుడుగా ఉన్న సురక్షిత్.. మహిళల ఆరోగ్యంలో నూతన ఆవిష్కరణలతో.. అంతర్జాతీయ లెవెల్లో ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. ఇక ఈయన గిన్నిస్ రికార్డుతో పరిమితం కాలేదు.

చెన్నైలోను ఓ మహిళా రెండో త్రేమాసికంలో గర్భసంచి పగిలి.. పిండం పొట్టులోకి జారిన అత్యంత క్రిటికల్ కండిషన్‌ను కూడా సక్సెస్ఫుల్గా బయటపడేసాడు. సాధారణంగా ఇలాంటి సందర్భంలో పిండాన్ని అలాగే గర్భాశయాన్ని తొలగించి రోగి ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నిస్తారు. కానీ.. ఇక్కడ రోగి తన బిడ్డ కావాలని కోరడంతో పగిలిన గర్భాసయాన్ని అతికించి పిండాన్ని తిరిగి గర్భసంచిలోకి ఉంచి విజయవంతంగా శాస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ ప్రపంచంలోనే మొదటిసారి. అంతేకాదు.. ఆ రోగి సెకండ్ డెలివరీని సురక్షితంగా పూర్తి చేసి సంతోషంగా లైఫ్ లీడ్‌ చేస్తుంది. అంతే కాదు ఇప్పటికే ఇలాంటి ఎన్నో అర్థైన వైద్యా రికార్డ్‌లను క్రియేట్ చేశాడు సుర‌క్షిత్‌.