పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్కు మద్దతు ఉంటామంటూ వెల్లడించాయి. మరోవైపు ప్రతీకారంతో భారత్ రగిలిపోతున్న క్రమంలో.. ఆపరేషన్ సింధుర్ను ప్రకటించి పాకిస్థాన్ మీద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ కూడా భారత్పై ఎదురుదాడికి దిగింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ విఫలమైంది. ఈ క్రమంలోనే పరస్పరం పాక్, భారత్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ సహాయం పొందిన ఓ దేశానికి చెందిన యుద్ధనౌక.. పాక్ పోర్టులో కనిపించింది.
గతంలో భారత్ అడగకుండా.. అందరికంటే ముందే ఆ దేశనికి సహాయం చేస్తే ఇప్పుడు దాని క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు టర్కీ. ప్రస్తుతం టర్కీని బహిష్కరించాలని భారతీయులంతా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 6 భూకంపాలు సంభవించడంతో సిరియాతో పాటు టర్కీ అతలాకుతలం అయ్యింది. ఆ సమయంలో ప్రపంచం అన్ని దేశాల కంటే ముందు.. భారత్ – టర్కీకి అండగా ఉంటామని సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. అనంతరం టర్కీకి సహాయం చేయడానికి ఆపరేషన్ దోస్త్ మొదలుపెట్టింది. తక్షణమే టర్కీ కావాల్సిన సహాయ చర్యలపై ప్రధాని మోడీ పలు శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించారు.
టర్కీ కోసం ఏకంగా 8,45,590 డాలర్ల సహాయ సామాగ్రిని అందించారు. మరోవైపు భారత్ ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు టర్కీకి సహాయ చర్యల్లో నిమగ్నమైపోయాయి. ఆ సమయంలో భారత వైమానిక దళం టర్కీ 17 విమానాలను పంపించి ఎంతగానో సహకరించింది. టర్కీ రాయబారి అయినా ఫిరీత్ సునేల్.. భారత్కు కృతజ్ఞతలు తెలుపుతూ అవసరంలో నిలబడటమే అసలైన స్నేహం అని.. నిజమైన స్నేహితుడని చెప్పుకొచ్చి.. ఢిల్లీకి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక తాజాగా ఏప్రిల్ 22, 2025న భారత్లోని పర్యాటకుల లక్ష్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల పాసవిక దాడి (పహల్గాం ఎటాక్).. అందరికీ తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు మరణించారు. దీంతో ప్రపంచమంతా ఉగ్రదాడిని ఖండించాయి. ఇజ్రాయిల్ లాంటి దేశం భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న అండగా ఉంటానని మద్దతు ప్రకటించింది.
అంతేకాదు.. అగ్రరాజ్యాలైన అమెరికా నుంచి రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ల వరకు అన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్న క్రమంలో.. పరోక్షంగా పాక్ వైఖరిని తప్పు పట్టిన నేపథ్యంలో.. టర్కీకి చెందిన టిజిసి బుయికడ అనే భారీ యుద్ధనౌక కరాచీ తీరంలో కనిపించడం అందరికీ షాక్ కలిగించింది. ఇదే క్రమంలో టర్కీ పాకిస్తాన్ కు మద్దతు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా భారత నగరాల్లో సైనిక స్థావరాలపై పాకిస్తాన్ జరిపిన దాడుల్లో డ్రోన్లను టర్కీ పంపినట్లు ప్రాథమిక విచారణలో తెలిందని కేంద్రం అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో భారత్ చేసిన సహాయాన్ని మర్చిపోయి తిరిగి.. మనపై విషం జల్లుతూ.. వెన్నుపోటు పొడిచినందుకు టర్కీ పై నిప్పులు చెరుగుతున్నారు ఇండియన్స్. బాయ్ కాట్ టర్కీ అనే క్యాంపైను ప్రారంభించి టర్కీ పై విమర్శలు కురిపిస్తున్నారు.