టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే సెట్స్పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర పల్లిలో జరుపుకుంటున్నారు. అక్కడ స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఇక కే. ఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఇలాంటి క్రమంలోనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ ఇద్దరు రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. దాని బదులు నెలవారి జీతాలు తీసుకుంటున్నారని సమాచారం. భారీ స్థాయిలో లాంగ్ స్కేడ్యులింగ్ ఉన్న క్రమంలో.. శాటిలైట్, టికెట్, ఓటీటీ హక్కుల ద్వారా వందల కోట్ల బిజినెస్ జరుపుకోవడం పై యూనిట్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే నిర్మాణ వ్యయం అదుపులో ఉంచడానికి.. లాభాల్లో వాటా పొందేలా ఈ డీల్ ను జరుపుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అంతేకాదు.. కే.ఎల్.నారాయణ వీరిద్దరి డేట్స్ కోసం అడ్వాన్సులు ఇచ్చి హోల్డ్లో పెట్టారట. ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. ఈ క్రమంలోనే కే.ఎల్. నారాయణతో పాటు.. మరికొంతమంది కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్లకు నెలసరి జీతంతో పాటు.. టీం ఖర్చులు కూడా నిర్మాతలే భరిస్తున్నారు.