ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్లు కూడా.. అదే కోవకు చెందుతాయి. పాకిస్తాన్ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద ఉన్న ఈ ఐదు క్షిపణులు ఏంటో.. వాటి ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
బ్రహ్మాస్
భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. ఇది మార్క్ 3 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కచ్చితంగా చేదిస్తుంది. ఇందులో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది శత్రువు రక్షణ వ్యవస్థలను ఇట్టే చేదించగలదు.
అగ్ని సిరీస్ :
ఈ అగ్ని సిరీస్ లోని అగ్ని వి అంతరిక్ష స్థాయి క్షిపణి. ఇది 5000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి టార్గెట్ ను రిచ్ కాగలదు. ఈ క్షిపణులు సాధారణ.. లేదా అణు ఆయుధాలను మోయగల సామర్థ్యంతో ఉండడం విశేషం.
ప్రలయ్:
ఈ మిసైల్ శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను అత్యంత వేగంగా కచ్చితంగా ముట్టడించి.. నేలమట్టం చేయగలదు. దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించేలా డిజైన్ చేశారు.
నిర్బయ్:
నిర్భయ్ అనేది సపోసోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది తక్కువ టైం లోనే ఎక్కువ ఎత్తులో ఎగురుతూ.. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను సైతం టచ్ చేయగలదు. ఇది శత్రుదేశం లోతుల్లో తాకాల్సిన లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది.
సూర్య:
సూర్య హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే గొప్ప క్షిపణి. దీన్ని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. 700 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను సైతం టచ్ చేయగలదు. దీనిని గుర్తించడం.. తిప్పి కొట్టడం చాలా కష్టతరం. ఇక తాజాగా జరిగిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో.. ఈ క్షిపణుల యాక్టివేషన్ ద్వారా.. భారత్ తన రక్షణలో ఎంత సంసిద్ధంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రు దేశాలపై తక్షణ ప్రతీకార చర్యలకు.. ఆయుధాలు కీలక పాత్ర పోషించవచ్చని రక్షణ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.