అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాల‌కు సూచించిన ప్రధాని..!

గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్‌ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వివరించాడు.

India vs Pakistan: Who Will the World Support in a War | Dynamite News

నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాడు. సివిల్ డిఫెన్స్ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై మరియు.. తప్పుడు వార్తలను తిప్పి కొట్టేందుకు చర్యలు చేపట్టడం పై కీలక మౌలిక సౌకర్యాలు భద్రత కల్పించే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోడీ వెల్లడించాడు.

India vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తుందా..? ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయంటే..? | List of ...

పహల్గాం ఉగ్రదాడి.. పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరుదేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. భారత్ ఈ యుద్ధంలో సక్సెస్ సాధించింది. పాకిస్తాన్‌కు భారతదేశం సమయస్ఫూర్తితో గట్టిగా సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ పై ప్రతిదాడికి దిగి పాకిస్తాన్ కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ పై వైమానిక దాడులు మిస్సైల్‌తో విరుచుకుపడి.. కరాచిను పూర్తిగా ధ్వంసం చేసింది.