పహల్గామ్ దాడి తర్వాత మన దేశం ప్రతీకారచర్యగా అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ ఎగ్జిక్యూషన్ తో ఆర్మీ దళాలు అదరగొట్టారు. ఇక ఈ పని తీరుపై సర్వత్ర ప్రశంసలు దక్కడమే కాదు.. ఆర్మీ శక్తిని హనుమంతుడితో పోలిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు జనం. పాక్ కొంచెం ఎక్స్ట్రాలు చేసిన మరో ఆపరేషన్ స్టార్ట్ చేసి అంతు చూస్తాం అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు మనవాళ్ళు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ గురించే అంత మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ పై విమర్శలు కురిపిస్తూనే.. దేశభక్తితో ఉప్పొంగిపోతున్నారు.
కాగా మోడీ ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూరనే పేరును.. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన భారత స్త్రీలకు న్యాయం చేసేందుకు.. ఇచ్చిన హామీకి మారుపేరుగా రూపొందించారు. ఈ క్రమంలోనే తెలుగు మూవీ సింధూర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఖడ్గం.. సింధూర్ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుంటే చాలు జనం స్క్రీన్ లోకి అతుక్కుపోయి చూస్తారు. అంతలా ఆయన సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాదు.. భారతీయులు గర్వించదగ్గ కంటెంట్ సినిమాను రూపొందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ మరింత ట్రెండింగ్గా మారుతుంది.
కృష్ణవంశీ ముందు ఆలోచనతోనే ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రశంసిస్తున్నారు నెటజస్లు. ఈ ఆపరేషన్కు మోడీ గారు మీ సినిమా పేరు పెట్టుకున్నారు కదా.. మీ ఆలోచనలు మాతో పంచుకోండి అని అడగగా.. వందేమాతరం అంటూ కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు. ఇక ఈ క్రమంలోని అభిమానులంతా ఖడ్గం సీక్వెల్ గా ఖడ్గం 2ని రూపొందించాలంటూ ఆయనను కోరుతున్నారు. మరోపక్క మా బాస్ చిరంజీవితో ఆపరేషన్ సింధూర్ టైటిల్ పెట్టి ఈ సినిమా రూపొందిస్తే మరింత బాగుంటుంది అంటూ మెగా అభిమానులు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇదే టాపిక్ నెటింట తెగ ట్రెండ్ అవుతుంది.