ప్రస్తుతం ఆడియన్స్ సినిమాను చూసే విజన్ అంత మారిపోయింది. ఆస్వాదించే తీరు చాలా చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ లాంటి విషయాల్లో సాధారణ విషయాలుగా అసలు పరిగణించడం లేదు. ఆడియన్స్, హీరోలు ఏం చేసినా అంతకుమించి ఇంకా ఏదో ఆశిస్తున్నారు. ప్రేక్షకులు ఇటీవల కాలంలో యాక్షన్స్ సన్నివేశాలను, హింసాత్మక సన్నివేశాలను ఎక్కువగా ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బ్యాక్డ్రాప్తో రిలీజ్ అయిన ప్రతి సినిమాలు ఇటీవల కాలంలో ఆడియన్స్ను విపరీతంగా ఆదరిస్తూ.. మేకర్లకు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే నిజానికి గతంలో హీరోయిన్ యాక్షన్ బోర్డ్ సినిమాలు తెలుగులో పెద్దగా తెరకెక్కేవి కాదు.
చాలా అరుదుగా కనిపించేది. కానీ.. ఇప్పుడు రెండు తెలుగు ఇండస్ట్రీలు కూడా అనుసరించే పనిలో బిజీగా ఉంది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గతేడాది రిలీజ్ అయ్యు ఇలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్లో మహాకాళి అవతారంలో బన్నీ విజృంభించి.. శత్రువులను కత్తితో చీల్చి చెండాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా కాటేరామ్మ కొడుకుల ప్రభాస్ సృష్టించిన రక్తపాతం, యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే సినిమాకు కంటిన్యూషన్ గా సలార్ 2 లైన్ లో ఉంది. ఇక పార్ట్ 2లో ప్రశాంత్ ఎంతటి రక్తపాతం సృష్టిస్తాడో వేచి చూడాలి.
ఇక దసరా సినిమాతో తనలోని వైల్డ్ యాక్షన్ కోణాన్ని బయటపెట్టిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు అంతకుమించి హింసాత్మక యాక్షన్ సినిమా హిట్ ది థర్డ్ కేస్ రూపంలో ఆడియన్స్ను పలకరించనున్నాడు. దీంట్లో.. ఆయన శత్రువుల్ని వేటాడే తీరు, రక్తపాతం సృష్టించే హింస.. ఏ స్థాయిలో ఉండనున్నాయో టిజర్ ట్రైలర్లతోనే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్, నాని కలయికల ది పారడైజ్ సినిమా ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా నటిస్తున్నాడు. దీని తర్వాత ఆయన శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో మరో యాక్షన్ ఎంటర్టైన చేయనున్నాడు. దీనికి ప్రొడ్యూసర్గా నాని వ్యవహరించనున్నారు.
హింస రక్తపాతంతో నిండిన యాక్షన్ కథంశంతో ముస్తాబు కానున్న ఈ సినిమా.. ఆడియన్స్లో ఆసక్తి నెలకొల్పుతుంది. ఈ మూవీలో చిరు హింసలో శాంతిని వెతికే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. ఎన్టీఆర్ దేవరలో చూపించిన యాక్షన్ ను ఎంతల ఆడియన్స్ ఎంజాయ్ చేశారో చూసాం. ఇప్పుడు మరోసారి ప్రశాంత్ డైరెక్షన్లో ఎన్టీఆర్ పిరియాడికల్ యాక్షన్ డ్రామా దేవర ను మించిన రేంజ్లో ఉండనున్నట్లు సమాచారం. అలా.. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్అంతా రక్తపాతానికి, యాక్షన్, హింసాత్మక సినిమాలకే ఓట్లు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టాలీవుడ్ స్టార్స్ కూడా ఆడియన్స్కు నచ్చే అలాంటి కంటెంట్ని చూపించడానికి సై అంటున్నారు.