అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట.. ఈ ఏడాది జనవరిలో అన్నపూర్ణ స్టూడియోస్లో సింపుల్గా వివాహం చేసుకున్నారు. పెళ్ళై సరిగ్గా ఆరు నెలలు కూడా కాకముందే.. అక్కినేని ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతున్నాయి. కేవలం ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేసిన సంఘటన తప్ప.. మిగతా సంఘటనలన్నీ అక్కినేని కుటుంబానికి చాలా ప్లస్ అయ్యాయి. ఎప్పటినుంచో ఫ్లాపుల్లో కూరుకుపైన చైతుకు తండేల్తో సెన్సేషనల్ హిట్ వచ్చింది.
ఈ మంచి జరిగిన అతి కొద్దిరోజుల్లోనే వీళ్ళిద్దరికి సంబంధించిన మరో శుభవార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. అదేంటంటే చైతు, శోభిత త్వరలోనే తల్లిదండ్రులు కానున్నరట. ఎస్.. ఇది నిజమే. శోభిత రీసెంట్గా గర్భం దాల్చిందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటికే దాదాపు ఇండస్ట్రీలో అన్ని ఛానళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే న్యూస్ తెగ వైరల్ గా మారడంతో.. అక్కినేని ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చైతు హేటర్స్ మాత్రం మళ్లీ గతాన్ని తవ్వుతూ.. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం పిల్లలు పుట్టక పోవడమేనని టాక్ నడుస్తుంది.
సమంత అనారోగ్యం కారణంగా విక్ అయ్యి బిడ్డను కనే శక్తిని కోల్పోయిందని.. ఈ కారణంతోనే నాగచైతన్య.. సమంతను వదిలేసాడంటూ వార్తలు వైరల్గా మారుతున్నాయి. ఇక ఇటివల సమంత.. భార్య అనారోగ్యంతో ఉంటే భర్త ఆమెను నుంచి విడిపోతాడని.. ఆమెకు విడాకులు ఇచ్చేయడానికి ఇష్టపడతాడని వివరిస్తున్న ఓ పోస్ట్ కు లైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇది మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ విడాకులకు కచ్చితంగా పిల్లల విషయమే కారణం అంటూ టాక్ నడుస్తుంది. కాగా చైతు, శోభితలకు పుట్టబోయేది పాప, బాబా అనే ఆసక్తి అక్కినేని అభిమానులు మొదలైంది. అంతేకాదు.. చైతూకి పాప పుడితే ఏం పేరు పెడతాడో.. బాబు పుడితే ఏం పేరు పెడతాడో అనే చర్చలు సోషల్ మీడియాలో క్రేజీ టాపిక్ ఆ ట్రెండ్ అవుతున్నాయి.