టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్తో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్ స్పీడ్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2027 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇలాంటి క్రమంలో.. ఎన్టీఆర్తో కలిసి నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ అమ్మడి ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. మహేష్ బాబుతో నటించి భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ. తర్వాత అనుకొని ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి సుకుమారి అమ్మ. ఈ సీనియర్ హీరోయిన్.. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన మెప్పించారు. స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
ఎక్కువగా మళయాళ, తమిళ్ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. తను చేసిన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక మహేష్ మురారి సినిమాల్లో కనిపించిన సుకుమారి.. ఈ సినిమాలో మహేష్ బామ్మ పాత్రలో మెరిసింది. ఇక సినిమాలో ఎక్కువ భాగం ఆమెపైనే రూపొందించారు. కాగా సుకుమారి మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలో నింపింది. చెన్నైలో తన నివాసంలోనే అగ్ని ప్రమాదానికి గురైన సుకుమారి.. ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు చుట్టుముట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే హార్ట్ ఎటాక్తో మరణించారు. 2013 మార్చ్ 26న ఆమె తుది శ్వాస విడిచారు.