టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల కాలంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన.. చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో కమెడియన్ పద్మనాభం కూడా ఒకరు. ఈయనకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలో కామెడీ సైతం హీరోలే చేస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. కానీ.. ఒకానొక టైంలో కామెడీ కంటే.. సపరేట్ ట్రాక్ ఉండేది. ఎంతోమంది కమెడియన్స్ తమ నటనతో ఆడియన్స్ను మెప్పించేవారు. వారిలో దివంగత కమీడియన్ పద్మనాభం ఒకరు. పద్మనాభం చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో రంగస్థలంపై నాటకాలతో.. కెరీర్ ప్రారంభించాడు.
తర్వాత ఆర్టిస్ట్ గా మారారు. 1950లో షావుకారు సినిమాతో నటన మొదలుపెట్టిన ఆయన.. తర్వాత పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, ఎల్లమ్మ ఇలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో మెప్పించాడు. తనదైన కామెడీతో టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పద్మనాభం.. సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. ప్రస్తుత హీరోలు రవితేజ, ప్రభాస్ సినిమాల్లోనూ ఆయన కనిపించాడు. పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో మరణించాడు. ఇది తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. అయితే కమెడియన్ పద్మనాభం కొడుకు కూడా టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి ఇమేజ్ తో రానిస్తున్నాడు అనే సంగతి చాలా మందికి తెలియదు.
ఆయన మరెవరో కాదు ఇప్పటికే ఎన్నో సినిమాలు తో స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తిరుపతి ప్రకాష్. ఈయన చాలా సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ లాంటి కామెడీ షో లోను మెప్పించాడు. పద్మనాభం.. తిరుపతి ప్రకాష్ కు పెదనాన్న అవుతారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తిరుపతి ప్రకాష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సినిమాల్లోకి రావడానికి తన పెదనాన్న పద్మనాభం సపోర్ట్ చేశారని.. ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఆలీ తనకు సపోర్ట్ చేశారని వివరించాడు. కాగా ప్రస్తుతం ఈయన పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.