టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ల మధ్య ఇప్పటివరకు ఎలాంటి బాక్సాఫీస్ వార్ జరిగిందే లేదు. వీళ్ళిద్దరి సినిమాలు రోజుల వ్యవధిలో రిలీజై ఎప్పుడు పోటీ నెలకొనలేదు. కేవలం హ్యాపీ, జై చిరంజీవ సినిమాలు మాత్రమే నెలలు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పట్లో నెలల గ్యాప్ అంటే అది పెద్ద క్లాష్ కాకపోవచ్చు. కానీ.. అప్పట్లో సినిమాల థియేట్రికల్ రన్ ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే అప్పట్లో నెలల గ్యాప్ తోను క్లాష్ ఏర్పడేది. అలా.. హ్యాపీ, జై చిరంజీవ సినిమాలకు మధ్య మాత్రమే క్లాష్ ఏర్పడింది. ఇక 2006లో చిరంజీవి సినిమాలను వదిలేసి.. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పోటీనే నెలకొనలేదు. ఇక రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇక రీ ఎంట్రీ తర్వాత మెగా, అల్లు అభిమానుల మధ్యన కోల్డ్ వార్ కొనసాగుతున్నా.. ఇద్దరు హీరోల మధ్య మాత్రం ఎలాంటి క్లాష్ నెలకొనలేదు. కానీ.. ఇప్పుడు చిరు వర్సెస్ బన్నీ వార్ నెలకొననుంది. అసలు మేటర్ ఏంటంటే.. బన్నీ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన దేశముదురు సినిమా ఈ ఏడాది మే 10న రీ రిలీజ్ కానుంది. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. 2023లో సినిమాను బన్నీ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఆ సమయంలో సినిమాకు దాదాపు రూ.50 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు.. మరోసారి సినిమా రీ రిలీజ్ కానుంది.

అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ ముందు రోజున మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఆల్ టైం క్లాసికల్గా నిలిచిపోయి.. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన జగదీక వీరుడు అతిలోకసుందరి సినిమాను కూడా రిలీజ్ చేయనన్నారు. కేవలం 2d లో కాదు.. 3d వర్షన్లో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఇక ఓ పాత సూపర్ హిట్ సినిమాని 3d వర్షన్లో రీ రిలీజ్ చేయడం అనేది ఇప్పటివరకు మన టాలీవుడ్ హిస్టరీలోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే జరగలేదు. ఈ క్రమంలోనే ఈ రీ రిలీజ్ సంచలనం సృష్టించాలని చిరు అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ నడుస్తున్న క్రమంలో.. ఇలాంటి క్లాష్ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. మరి ఈ మామా, అల్లుళ్ల మధ్య జరగబోయే పోరులో ఎవరు సక్సెస్ సాధిస్తారో.. ఎవరు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.