నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో అఖండ సీక్వెల్ గా.. అఖండ తాండవం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సింహాతో మొదలైన ఈ జర్నీ.. ఇప్పటికి సక్సెస్ఫుల్ కాంబోగా కొనసాగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై.. గోపీచంద్ అచ్చంట, రామ్ అచ్చంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రగ్యా, సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరువనున్న ఈ సినిమాలో.. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో అఘోరగా ఆయన శివతాండవం ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై.. ఆడియన్స్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా మొదట.. సినిమాను సెప్టెంబర్ 25 దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినా.. ఇప్పుడు ఆ డేట్ మారబోతుందని.. విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాకపోవడమే దానికి కారణమని తెలుస్తుంది. అనుకున్న సమయానికి విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్య అవకాశం లేదని.. ఈ క్రమంలోనే టీం రిలీజ్ డేట్ ను వాయిదా వేసే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో బాలయ్యకు, బోయపాటికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తయని కూడా టాక్ నడుస్తుంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు – అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రిలీజ్ అవుతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య వర్సెస్ చిరు వార్ మొదలుకానిందని టాక్ నడుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర చిరు – బాలయ్య వార్ అంటే ఆడియన్స్లోను మరింత ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలోనే వచ్చేయడానికి సంక్రాంతి బరిలో కూడా బాలయ్య.. చిరుకి అఖండ 2తో చాలెంజ్ విసరనున్నాడట.. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ఇదే నిజమైతే ఈసారి సంక్రాంతి రేసులో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలలో ఎవరు సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.