స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై కనిపించి చాలా సమయం అయినా.. తన ఫ్యాన్స్కు మాత్రం.. అమ్మడు ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాదు.. తన ఫ్యాన్స్తో ముచ్చటించే సందర్భాలు కూడా ఉంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే.. తాజాగా తన ఇన్ స్టాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది సామ్. అంతేకాదు ఫ్యాన్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఓ వీడియోని చూసి షాక్ అయ్యానంటూ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మాట్లాడింది.
ఇంటర్నెట్ డూమ్స్ డే సిద్ధాంతానికి చెందిన ఆ వీడియో తనను తీవ్రంగా కల్చి వేసిందని.. అనేక ఆందోళనలను లేవనెత్తిందని.. వివరించింది. అంతేకాదు తనకు భయానక అనుభూతిని గురిచేసిందని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నలకు.. అమ్మే పార్వతి తిరువోతు, సాయి పల్లవి, నజ్రియా, ఆలియా భట్ అనన్యా పాండే పేర్లను ఆ వీడియోలో షేర్ చేసుకుంది. వీళంతా రాక్ స్టార్స్ అంటూ చెప్పి.. ఇంకా ఎవరైనా మర్చిపోతే మరో వీడియో చేస్తా అంటూ నవ్వుతూ వెల్లడించింది. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఈ అమ్మడు.. తిరిగి వచ్చేయండి మిమ్మల్ని ఆపేదెవరూ.. అని టాలీవుడ్ రీ ఎంట్రి గురించి ఓ అభిమాని చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యింది.
తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాను బ్రో అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత అభిమానులతో ముచ్చటించిన ఈ సరదా చిట్ చాట్ వైరల్ గా మారుతుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. గత రెండేళ్లుగా టాలీవుడ్కు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా సిటాడెల్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన యాక్టింగ్తో ఆడియన్స్ను మెప్పించింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ.. ది బ్లడీ కింగ్ డమ్ సిరీస్ చేస్తూ బిజీగా గడుపుతుంది. అంతేకాదు.. కొన్ని నెలల క్రితం తన సొంత నిర్మాణ బ్యానర్ ట్రటాట మూవింగ్ పిక్చర్స్ ను స్థాపించి.. ఈ బ్యానర్ పై తనే ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మరే అప్డేట్ రివీల్ చేయలేదు.