టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. కియారా ఆధ్వనీ హీరోయిన్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కాంబో సెట్స్ పైకి రాకముందే.. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాంగ్స్ పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా.. సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అభిమానులో హైప్ను పెంచాయి.
ఇటీవల టీజర్ అనౌన్స్మెంట్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్.. ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక నవంబర్ 9వ తేదీన గేమ్ చేంజ్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ టీజర్తో సినిమాపై మరింత హైప్ పెరుగుతుందని.. సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ శంకర్ ఇవ్వబోతున్నట్లు టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ లోనే మిగతా సాంగ్స్ ను కూడా రిలీజ్ చేసి డిసెంబర్ మొత్తం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం వాడనున్నారట. ఇది నిజంగానే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు.
ఇక ఈ సినిమాను వచ్చేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఫ్రీ రిలీజ్ సేల్స్ లో గేమ్ ఛేంజర్ అదరగొడుతుందని టాక్. దీనికి తగ్గట్టుగానే సినిమా టికెట్ రేట్ల పెంపు కూడా భారీగా ఉండనుందని.. దీంతో మేకర్స్కు మరింత ప్లస్ అవనున్నట్లు సమాచారం. ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమాతో కియరా అద్వాని, రామ్ చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారు లేదో వేచి చూడాలి.