టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పవన్ కళ్యాణ్ బంగారం మూవీ హీరోయిన్ మీరాచోప్రా ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మీరా చోప్రా ఆ తర్వాత కూడా తెలుగులో పలు సినిమాలలో నటించింది. అయితే తర్వాత అమ్మడు నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలతో పాటు పలు వివాదాల ద్వారా కూడా మీరా చోప్రా వార్తల్లో వైరల్ అయ్యింది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సౌత్ ఇండియాలో తనకు ఎక్కువగా సినిమా అవకాశాలు వరించాయని.. నార్త్లో మాత్రం అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందంటూ వెల్లడించింది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నా బంధువేనని ఆమె చెప్పుకొచ్చింది. మాది ఓ మధ్యతరగతి కుటుంబం అంటూ మీరా చోప్రా షేర్ చేసుకుంది. ప్రియాంక చోప్రా సినిమాల్లోకి అడుగు పెట్టడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగిందని వివరించిన మీరా.. 2005 సంవత్సరంలో రిలీజైన ఓ మూవీతోతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది.
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 25 సినిమాలలో హీరోయిన్గా నటించానని.. సౌత్లో నటించడం నాకు పెద్దగా ఇష్టం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇండస్ట్రీలో నాకు భాష సమస్య ఉండేదని అందుకే ఇబ్బందిగా అనిపించేదంటూ కామెంట్లు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైంలో అవకాశాల విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాన.. ఆఫర్ల కోసం ఎవరిని కలవాలో అర్థం కాలేదంటూ వివరించింది. కొందరు అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి చివరకు ఆ పాత్ర కోసం వేరే వాళ్లను సెలక్ట్ చేసుకునేవాళ్లని మీరా చోప్రా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో మీరా చోప్రా చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ అవుతున్నాయి.